హైదరాబాద్లో హడలెత్తిస్తోన్న కరోనా..!
కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ముందుగానే అప్రమత్తమైంది. ప్రత్యేక వైద్యసహాయాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే వివిధ దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రతీ ప్రయాణికుడికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారికి కరోనా లేదని తేలితేనే.. నగరంలోకి వెళ్లడానికి అధికారులు అనుమతి ఇస్తున్నారు. కాగా.. చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన కారణంగా.. వారికి ప్రత్యేక విభాగంలో చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరిలో ఒక వ్యక్తిలో మాత్రమే […]
కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ముందుగానే అప్రమత్తమైంది. ప్రత్యేక వైద్యసహాయాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే వివిధ దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రతీ ప్రయాణికుడికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారికి కరోనా లేదని తేలితేనే.. నగరంలోకి వెళ్లడానికి అధికారులు అనుమతి ఇస్తున్నారు.
కాగా.. చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన కారణంగా.. వారికి ప్రత్యేక విభాగంలో చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరిలో ఒక వ్యక్తిలో మాత్రమే జలుబు, దగ్గు, జ్వర లక్షణాలు కనిపించడంతో వైద్యులు అతడి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం పూణెకు పంపించారు. పరీక్షల్లో కరోనా వైరస్ లేదని నిర్ధారించే వరకూ కుటుంబసభ్యులు, సన్నిహితంగా ఉండేవారిని ఇళ్లకే పరిమితం చేయాలని ఆదేశాలు జారీచేసింది.
ఈ వైరస్ లక్షణాలు కనిపించడానికి సుమారు రెండువారాలు పట్టే అవకాశాలు ఉన్నాయని, ఆలోగా వ్యాధి లేదని బయట తిరిగితే.. ఇతరులకు వ్యాప్తిచెందే ప్రమాదముందని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే.. రోగుల బ్లడ్ను టెస్ట్ చేసిన డాక్టర్లు.. వారిలో ఎవరికీ కరోనా లేదని తేల్చి చెప్పారు. దీంతో.. తెలంగాణ వైద్య శాఖ ఊపిరి పీల్చుకుంది.
కరోనా వైరస్ లక్షణాలు ఇవే:
1. ఈ వ్యాధి సోకిన వారికి జలుబు ఎక్కువగా ఉండి, ముక్కు కారుతూనే ఉంటుంది. 2. గొంతులో మంటగా ఉంటుంది. 3. తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి. 4. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది.
పైన తెలిపిన లక్షణాలు ఉంటే… వెంటనే డాక్టర్ను కలవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వైరస్కి మందు లేదు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే రెగ్యులర్గా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలి. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని మీ చేతులతో టచ్ చేయవద్దు. రోగులకు దగ్గరగా ఉండొద్దు. ప్రస్తుతం ఫీవర్ ఆసుపత్రిలో ఉన్నవారి కుటుంబ సభ్యులను కూడా ఇంటికి పరిమితం చేశారు అధికారులు.