కరోనా వీరవిహారం.. 24 గంటల్లో 137 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది. కేసుల సంఖ్య ఒక లక్ష 25 వేల మార్క్ ని దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు లెవల్ లో 6,654 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికం. మరో 137 మందిని వైరస్ బలి తీసుకుంది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 125101 దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 69597 దేశవ్యాప్తంగా […]
దేశంలో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది. కేసుల సంఖ్య ఒక లక్ష 25 వేల మార్క్ ని దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు లెవల్ లో 6,654 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికం. మరో 137 మందిని వైరస్ బలి తీసుకుంది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 125101 దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 69597 దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య మొత్తం 3720 కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారు 51784
ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అక్కడ రోజూ నమోదవుతున్న కేసులు ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతున్నాయి. కొత్తగా 2940 కేసులు నమోదవ్వడంతో…ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 44582కి చేరుకుంది. ఇక ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ లలో కూడా పది వేలకు పైగా కేసులున్నాయి.