బీజేపీలో… తెలుగు నేతల మధ్య కోల్డ్ వార్?

బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి – టీజీ వెంకటేశ్ కు పొసగడం లేదనే విషయం ఇప్పుడు ఏపీ బీజేపీ వర్గాల్లో ట్రెండ్ అవుతోంది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ నేతలిద్దరూ తలోదారిలో నడుస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి – టీజీ వెంకటేశ్ తోపాటు సీఎం రమేశ్ – గరికపాటి మోహన్ రావు ఆపార్టీకి రాజీనామా చేసి – బీజేపీలో చేరారు. వీరిలో టీజే వెంకటేశ్ కి సుజనా చౌదరికి నడుమ […]

బీజేపీలో... తెలుగు నేతల మధ్య కోల్డ్ వార్?
Follow us

| Edited By:

Updated on: Sep 18, 2019 | 5:03 PM

బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి – టీజీ వెంకటేశ్ కు పొసగడం లేదనే విషయం ఇప్పుడు ఏపీ బీజేపీ వర్గాల్లో ట్రెండ్ అవుతోంది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ నేతలిద్దరూ తలోదారిలో నడుస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి – టీజీ వెంకటేశ్ తోపాటు సీఎం రమేశ్ – గరికపాటి మోహన్ రావు ఆపార్టీకి రాజీనామా చేసి – బీజేపీలో చేరారు. వీరిలో టీజే వెంకటేశ్ కి సుజనా చౌదరికి నడుమ మంచి స్నేహం ఉంది. ఆ స్నేహమే అయిష్టం అయినా వెంకటేశ్‌ను గోడదూకేసేలా చేసింది.

పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం తమపై వేటు వేయకుండా ఉండాలంటే జంప్ చేయడానికి సుజనాకు టీజీ వెంకటేశ్ మద్దతు తప్పలేదు. దీంతో ఆయన బలవంతంగా తన మిత్రుడితో కూడా బీజేపీకి జై కొట్టిం చేశారు. ఈ విషయాన్ని వెంకటేశ్ సైతం బాహాటంగానే అంగీకరించారు కూడా. ఇంత సఖ్యతగా ఉన్న ఆ ఇద్దరి నేతల మధ్య స్నేహం ప్రస్తుతం చెడినట్లే కనిపిస్తోంది. ఏపీ రాజధాని అంశంపై నేతలిద్దరూ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం గమనార్హం. బీజేపీ నుంచి రెండు గొంతులు వినిపిస్తుండటం చర్చనీయాంశం గా మారింది.

ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండి తీరాలని సుజనా చౌదరి డిమాండ్ చేస్తుండగా – వెంకటేష్ మాత్రం రాయలసీమను రాజధాని చేయాలని కోరుతున్నారు. చంద్రబాబు తాత్కాలిక రాజధాని కట్టారంటే అసలు రాజధాని లేనట్టేగా అంటున్నారు టీజీ వెంకటేశ్. అంతే కాదు రాజధాని మార్చే ఉద్దేశ్యం లేకపోతే కనీసం రెండో రాజధాని చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. టీజీ అంశం బీజేపీలో చర్చనీయాంశం అవుతోంది.

మరోవైపు… మురళీధర్‌ రావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. రాంమాధవ్‌, అదే బీజేపీలో మరో జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇద్దరూ తెలుగు నాయకులు, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వారు. అయితే ఇప్పడు ఈ ఇద్దరి మధ్యే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కోల్డ్‌ వార్‌ సాగుతోందన్న చర్చ సాగుతోంది. తెలంగాణకు చెందిన మురళీధర్ రావుకు, జాతీయస్థాయిలో మంచి పరిచయాలున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని నాయకుడిగా చలామణి అయ్యారు. నేషనల్‌ లెవల్‌లో పలు కీలక బాధ్యతలను పార్టీ ఆయనకు అప్పగించింది. అంతేకాదు, మొన్నటి వరకు తెలంగాణలోనూ ఆయన ఆధ్వర్యంలో కొన్ని చేరికలు జరిగాయి. అయితే ఇప్పుడు తగ్గాయి.

అయితే, ఏపీతో పాటు తెలంగాణ కమలంలోనూ ఏపీకి చెందిన రాంమాధవ్‌ జోక్యం పెరిగిందని మురళీధర్ రావు వర్గీయులు అసహనంతో రగిలిపోతున్నారట. డీకే అరుణతో పాటు చాలామంది కీలక నేతలను, బీజేపీలో చేర్పించింది రాంమాధవే. ఇంకా పార్టీలో చేరాలనుకుంటున్న చాలామంది ఇతర పార్టీల నాయకులు, రాంమాధవ్‌ ద్వారా అమిత్‌ షా సమక్షంలో పార్టీలో చేరతామని పట్టుబడుతున్నారట. ఈ పరిణామాలు సహజంగానే మురళీధర్‌ రావు వర్గీయుల అసంతృప్తికి కారణమయ్యాయని అంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లోనూ రాంమాధవ్‌ ఆధిపత్యంపై, మురళీధర్ రావు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలు కూడా రాంమాధవ్‌కు ఇచ్చిన ఇంపార్టెన్స్‌ను తనకివ్వడంలేదని మురళీధర్‌ రావు వర్గీయులు రగిలిపోతున్నారట.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!