AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో అక్రమ నిర్మాణాలపై ‘జగన్’ దృష్టి..

ఆంధ్రప్రదేశ్‌లోని అక్రమ కట్టడాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. అక్రమ కట్టడాలను గుర్తించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధమని తేలితే కూల్చేయాలని అన్నారు. కాగా.. సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో అక్రమ నిర్మాణంలో వున్న ‘ప్రజా వేదిక’ను కూల్చేయాలంటూ సీఎం జగన్ ప్రకటించారు. బుధవారం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని ‘ప్రజావేదిక’ నుంచే ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ నేతలు […]

ఏపీలో అక్రమ నిర్మాణాలపై 'జగన్' దృష్టి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 25, 2019 | 8:47 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని అక్రమ కట్టడాలపై సీఎం జగన్ దృష్టి సారించారు. అక్రమ కట్టడాలను గుర్తించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధమని తేలితే కూల్చేయాలని అన్నారు. కాగా.. సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో అక్రమ నిర్మాణంలో వున్న ‘ప్రజా వేదిక’ను కూల్చేయాలంటూ సీఎం జగన్ ప్రకటించారు. బుధవారం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాన్ని ‘ప్రజావేదిక’ నుంచే ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యే అని సీఎం జగన్‌ను విమర్శిస్తున్నారు. అలాగే.. మాజీ సీఎం చంద్రబాబు ప్రజావేదిక కావాలని అడినందుకే.. జగన్‌‌ ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా.. ఈ రోజు చంద్రబాబు హైదరాబాద్ రానున్నారు. రేపు అమరావతికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటాయో చూడాలి.