AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు అలెర్ట్.. నవంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ ఫస్టియర్ క్లాసులు..

కరోనా వైరస్ కారణంగా వాయిదాపడిన విద్యా సంవత్సరాన్ని(2020-21) ప్రారంభించేందుకు అఖిల భారత సాంకేతికత విద్యామండలి(ఏఐసీటీఈ) ప్రణాళికలు సిద్దం చేసింది.

విద్యార్థులకు అలెర్ట్.. నవంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ ఫస్టియర్ క్లాసులు..
Ravi Kiran
|

Updated on: Aug 17, 2020 | 12:41 AM

Share

AICTE Academic Calendar: కరోనా వైరస్ కారణంగా వాయిదాపడిన విద్యా సంవత్సరాన్ని(2020-21) ప్రారంభించేందుకు అఖిల భారత సాంకేతికత విద్యామండలి(ఏఐసీటీఈ) ప్రణాళికలు సిద్దం చేసింది. తాజాగా ఈ మేరకు నూతన అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రెండు, మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్ధులకు తరగతులు ప్రారంభించాలని అందులో పేర్కొంది. ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌ పద్దతిలో సీనియర్‌ విద్యార్థులకు క్లాసులు మొదలు పెట్టాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది.

అలాగే బీటెక్, బీఫార్మసీ, పీజీ ఫస్టియర్ తరగతులు నవంబర్ 1 నుంచి ప్రారంభించాలని తెలిపింది. అయితే కేంద్ర ఆరోగ్య, మానవ వనరుల శాఖ మార్గదర్శకాలకు అనుగుణం షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. అటు ప్రైవేటు కాలేజీల గుర్తింపు గడువు సెప్టెంబర్ 15వ తేదీగా ఖరారు చేసింది. ఇక అక్టోబర్ 20కి ఫస్టియర్ విద్యార్ధులకు మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తవుతుందని.. అలాగే నవంబర్ 1కి రెండో విడత కౌన్సిలింగ్ పూర్తి చేయాలని వెల్లడించింది. ఇక నవంబర్ 15లోపు ఖాళీ సీట్లలో విద్యార్ధులు చేరేందుకు తుది గడువు అని పేర్కొంది. కాగా, వాస్తవానికి అక్టోబర్ 15 నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించాల్సి ఉంది.

Also Read:

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ధోని..

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..

గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా.! అయితే మీకో అదిరిపోయే ఆఫర్..

జగన్ చుట్టూ పెద్ద కుట్ర జరుగుతున్నట్లుంది: హీరో రామ్