AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

రేపు దేశవ్యాప్తంగా లోక్‌సభ రెండో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 13 రాష్ట్రాల్లోని 95 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తమిళనాడులో 38 (వెల్లూరు తప్ప), కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8, అసోంలో 5, బీహార్‌లో 5, ఒడిశాలో 5, ఛత్తీస్‌గఢ్‌లో 3, […]

రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం
Ravi Kiran
|

Updated on: Apr 17, 2019 | 7:01 PM

Share

రేపు దేశవ్యాప్తంగా లోక్‌సభ రెండో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 13 రాష్ట్రాల్లోని 95 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

తమిళనాడులో 38 (వెల్లూరు తప్ప), కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8, అసోంలో 5, బీహార్‌లో 5, ఒడిశాలో 5, ఛత్తీస్‌గఢ్‌లో 3, పశ్చిమబెంగాల్‌ 3, జమ్మూకశ్మీర్‌ 2, మణిపూర్ 1, పుదుచ్చేరి 1 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

రెండో విడత ఎన్నికలు జరగనున్న స్థానాల్లో మాజీ ప్రధాని దేవెగౌడ, కాంగ్రెస్‌ నేతలు వీరప్పమొయిలీ, రాజ్‌బబ్బర్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఫరూఖ్‌ అబ్దుల్లా, భాజపా నాయకురాలు హేమమాలిని, డీఎంకే నాయకురాలు కనిమొళి వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.