పంజాబ్లో వాల్ పోస్టర్ కలకలం.. సీఎం అమరీందర్ సింగ్ను చంపితే కానుక అంటూ ప్రకటన.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ను చంపాలంటూ గుర్తు తెలియని వ్యక్తి స్థానికంగా పోస్టర్ను అంటించాడు.
Death threat to Punjab CM: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ను చంపుతామంటూ వెలిసిన వాల్ పోస్టర్ ఆ రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. సీఎం అమరీందర్ సింగ్ను చంపాలంటూ గుర్తు తెలియని వ్యక్తి స్థానికంగా పోస్టర్ను అంటించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సెక్టార్ 66-67 క్రాసింగ్ సమీపంలో పోస్టర్ దర్శనమిచ్చింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ను చంపితే రూ.10 లక్షలు ఇస్తారని ఓ పోస్టర్ వెలసింది. ఇదే క్రమంలో దీనికి సంబంధించిన ఓ ఈమెయిల్ ఐడీని కూడా పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోస్టర్ను ఎవరు అంటించారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్నామని త్వరలో నిందితులను పట్టుకుంటామని పంజాబ్ రాష్ట్ర పోలీసులు తెలిపారు.