రోహిత్ శర్మ, బుమ్రా లేకున్నా టీ20 సిరీస్ గెలిచాం.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీమిండియ సారథి
రోహిత్ శర్మ, బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు లేకపోయినా ప్రస్తుత జట్టు బాగా రాణించి సిరీస్ను కైవసం చేసుకుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో కాంట్రవర్సికీ తెరలేపాడు. మరోవైపు హార్దిక్ పాండ్య ఆటతీరుపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు.

రోహిత్ శర్మ, బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు లేకపోయినా ప్రస్తుత జట్టు బాగా రాణించి సిరీస్ను కైవసం చేసుకుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో కాంట్రవర్సికీ తెరలేపాడు. మరోవైపు హార్దిక్ పాండ్య ఆటతీరుపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా ఆటతీరు పట్ల కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతృప్తిని వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా మిగిలిన ఆటగాళ్లు రాణించడంపై హర్షం వ్యక్తం చేశాడు.
టీ20 సిరీస్లో చాలా బాగా ఆడామని అన్నాడు. పరిమిత ఓవర్ల స్పెషలిస్టులైన రోహిత్ శర్మ, బుమ్రా వంటి స్టార్లు ప్రస్తుతం అందుబాటులో లేకపోయినా టీమిండియా జట్టు బాగా రాణించిందంటూ వ్యాఖ్యానించారు. ఈ టీమ్ పట్ల తానెంతో గర్వంగా ఉన్నాను అంటూ అభిప్రాయపడ్డారు.
2016లో హార్దిక్ జట్టులో ఎంపికవ్వడానికి ప్రధాన కారణం అతడి సామర్థ్యమే అంటూ ప్రశంసించాడు. అతడిలో అసలైన ప్రతిభ ఉందంటూ పేర్కొన్నాడు. రాబోయే 4-5 ఏళ్లలో మరింత అత్యుత్తమంగా ఆడతాడు అంటూ అభినందించాడు వన్డే సిరీస్లో ఓడిన తర్వాత టీ20 సిరీస్లో అత్యుత్తమంగా రాణించాలని తామంతా భావించినట్లు కోహ్లీ తెలిపాడు. ఐపీఎల్ వల్ల టీమ్ఇండియా బలమైన టీ20 జట్టుగా మారిందని అభిప్రాయపడ్డాడు.
