నివర్ తుఫాన్ అలెర్ట్.. తమిళనాడు, పుదుచ్చేరిలలో సీఏ పరీక్షలు రీ-షెడ్యూల్.. వివరాలివే..

|

Nov 24, 2020 | 4:17 PM

తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు నివార్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఏ నవంబర్...

నివర్ తుఫాన్ అలెర్ట్.. తమిళనాడు, పుదుచ్చేరిలలో సీఏ పరీక్షలు రీ-షెడ్యూల్.. వివరాలివే..
Follow us on

CA Exams 2020: తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు నివార్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తీరం వైపు తుఫాన్ దూసుకొస్తుండటంతో ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎడతెరి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఏ నవంబర్ 2020 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అఫ్ ఇండియా(ఐసీఏఐ) వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాల్లోని  తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఏ పరీక్షను రీ-షెడ్యూల్ చేస్తున్నట్లు ఐసీఏఐ స్పష్టం చేసింది.

తమిళనాడు, పుదుచ్చేరిలోని విద్యార్ధులకు ఇంటర్మీడియట్, ఐపీసీ పరీక్షను డిసెంబర్ 9వ తేదీన నిర్వహిస్తామని.. అలాగే ఫైనల్(ఓల్డ్& న్యూ) పరీక్షను డిసెంబర్ 11న జరుగుతుందని ఐసీఏఐ తెలిపింది. కాగా, ఇప్పటికే జారీ చేసిన సీఎం నవంబర్ అడ్మిట్ కార్డ్ 2020 రీ-షెడ్యూల్ చేయబడిన పరీక్షలకు కూడా చెల్లుబాటు అవుతుందంది.

Also Read: 

ఏపీ: డిసెంబర్ 14 నుంచి 6,7 తరగతుల విద్యార్ధులకు క్లాసులు.. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు..]

ప్రముఖ నటుడు అషీష్ రాయ్ క‌న్నుమూత‌.. తీవ్ర విషాదంలో బాలీవుడ్ ఇండస్ట్రీ..

బిగ్ బాస్ 4: ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ భామేనా.!