ప్రముఖ నటుడు అషీష్ రాయ్ కన్నుమూత.. తీవ్ర విషాదంలో బాలీవుడ్ ఇండస్ట్రీ..
బాలీవుడ్ ఇండస్ట్రీని వరుస మరణాలు వెంటాడుతున్నాయి. తాజాగా టీవీ నటుడు అషీష్ రాయ్(55) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్దిరోజులుగా...
TV Actor Ashiesh Roy: బాలీవుడ్ ఇండస్ట్రీని వరుస మరణాలు వెంటాడుతున్నాయి. తాజాగా టీవీ నటుడు అషీష్ రాయ్(55) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఈ రోజు ఉదయం తన ఇంటి దగ్గరే తుది శ్వాస విడిచారు. మే నెలలో ఆసుపత్రిలో చేరిన అషీష్ రాయ్కు.. సరైన ఆఫర్స్ రాకపోవడంతో వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కరోనా, లాక్డౌన్ పరిస్థితులు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించాయి.
ఈ తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచినట్లు సీఐఎన్టీఏఏ సీనియర్ జాయింట్ సెక్రటరీ అమిత్ బెహ్ల్ ధృవీకరించారు. బనేగి అప్ని బాత్, సాసురల్ సిమార్ కా, కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ లాంటి ప్రముఖ టీవీ సీరియల్స్తో అషీష్ రాయ్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం. ఆయన మృతికి బాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా, ఈ ఏడాది ఇప్పటికే బాలీవుడ్లో పలువురు ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే.