కాబూల్లో బాంబు పేలుళ్లు.. 10మంది మృతి
శనివారం ఆఫ్ఘన్ రాజధానికి తూర్పున ఒక ప్యాసింజర్ బస్సు ప్రయాణిస్తోన్న సమయంలో బాంబు పేలడంతో 10 మంది పౌరులు మృతి చెందారని అధికారులు తెలిపారు.
శనివారం ఆఫ్ఘన్ రాజధాని కాబుల్కి తూర్పున ఒక ప్యాసింజర్ బస్సు ప్రయాణిస్తోన్న సమయంలో బాంబు పేలడంతో 10 మంది పౌరులు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఓ విద్యాలయం సమీపంలో జరిగిన ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో పాఠశాల చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది సూసైడ్ అటాక్గా సమాచారం అందుతోంది. యుద్దం ముగించడానికి ఖతార్లో తాలిబాన్, ఆఫ్ఘన్ ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరిపినప్పటికీ ఇటీవలి కాలంలో హింస పెరిగింది. ఉదయం 10:30 గంటల సమయంలో బస్సు కాబూల్ నుంచి ఘజ్ని, వాహీదుల్లా జుమాజాడాకు వెళుతుండగా బాంబు పేలిందని ఘజ్ని గవర్నర్ ప్రతినిధి తెలిపారు. నలుగురు పోలీసులు కూడా ఈ బాంబ్ బ్లాస్ట్లో గాయపడ్డారు. ఈ దాడి తాలిబాన్ల పనేనని ఘజ్ని పోలీసు ప్రతినిధి ఆడమ్ ఖాన్ సీరత్ పేర్కొన్నారు. గత నెలలో ప్రభుత్వంతో శాంతి చర్చలలో జరినప్పటికీ, ఆధిక్యత ప్రదర్శించే ప్రయత్నంలో తాలిబాన్లు హింసను పెంచారు.
Also Read :
Breaking : హత్రాస్ కేసు విచారణ అధికారి భార్య ఆత్మహత్య