AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4 : కొంపముంచిన రీయూనియన్.. సోహెల్ కు అర్ధమయ్యేలా సైగలు చేసిన మెహబూబ్ దిల్ సే

బిగ్ బాస్ ఆదివారంతో నాలుగో సీజన్ ను పూర్తి చేసుకోనుంది. మరి కొద్దీ సేపట్లో సీజన్ 4 విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. ఈ సమయంలో సోహెల్ కు సంబందించిన ఓ వార్త హాట్ టాపిక్ అవుతుంది.

Bigg Boss 4 : కొంపముంచిన రీయూనియన్.. సోహెల్ కు అర్ధమయ్యేలా సైగలు చేసిన మెహబూబ్ దిల్ సే
Rajeev Rayala
|

Updated on: Dec 20, 2020 | 7:32 PM

Share

బిగ్ బాస్ ఆదివారంతో నాలుగో సీజన్ ను పూర్తి చేసుకోనుంది. మరి కొద్దీ సేపట్లో సీజన్ 4 విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. ఈ సమయంలో సోహెల్ కు సంబందించిన ఓ వార్త హాట్ టాపిక్ అవుతుంది. విషయం ఏంటంటే.. టాప్ 5 కంటెస్టెంట్స్ లో అభిజీత్, సోహెల్, అఖిల్, హారిక, అరియానా ఉన్నారు. వీరిలో అభిజీత్ మొదటి స్థానంలో ఉండగా సోహెల్ రెండో స్థానంలో అఖిల్ మూడో స్థానంలో ఉన్నారని తెలుస్తుంది. అయితే సోహెల్ 25 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడని అంటున్నారు. అయితే సోహెల్ రన్నర్ గా నిలవనున్నాడు. కానీ 25 లక్షలు తీసుకొని అతడు వెళ్ళిపోతే రన్నర్ గా అఖిల్ నిలుస్తాడు. అఖిల్ కోసమే సోహెల్ ఈ త్యాగం చేస్తున్నాడని కొందరు అంటున్నారు. గతంలో అఖిల్ టాప్ 2 లో ఉన్నాడని ఉంది అని అన్నాడు. అందుకోసం సోహెల్ ఈ నిర్ణయం తీసుకున్నాడని నెటిజన్లు అంటున్నారు. రీయూనియన్‌లో భాగంగా ఇంటి లోపలికి వచ్చిన మెహబూబ్ సోహెల్‌కు సైగలు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చిందంటున్నారు. సోహెల్ కు అర్ధమయ్యేలా డబ్బులు తీసుకోమంటూ మెహబూబ్ సైగలు చేసాడు. దానితోపాటు అతడు ఎన్నో స్థానంలో ఉన్నాడో కూడా చెప్పాడు. దాంతో సోహెల్ డబ్బు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.