AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆపరేషన్ ఆకర్ష్’.. వంశీ బాటలోనే మరో టీడీపీ నేత.. షాకిచ్చిన బీజేపీ!

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. వంశీ రాజీనామా ప్రస్తుతం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఆయన వైసీపీలోకి వెళ్తారా.? లేదా బాబు బుజ్జగింపులతో తిరిగి టీడీపీలోనే ఉంటారా.? లేదా బీజేపీలోకి వెళ్తారా? అనేది తెలియాల్సి ఉంది.  ఇలాంటి తరుణంలో బీజేపీ నేత రఘురాం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వల్లభనేని వంశీతో పాటు టీడీపీకి చెందిన మరో నేత గంటా […]

'ఆపరేషన్ ఆకర్ష్'.. వంశీ బాటలోనే మరో టీడీపీ నేత.. షాకిచ్చిన బీజేపీ!
Ravi Kiran
| Edited By: |

Updated on: Oct 29, 2019 | 10:45 AM

Share

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. వంశీ రాజీనామా ప్రస్తుతం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఆయన వైసీపీలోకి వెళ్తారా.? లేదా బాబు బుజ్జగింపులతో తిరిగి టీడీపీలోనే ఉంటారా.? లేదా బీజేపీలోకి వెళ్తారా? అనేది తెలియాల్సి ఉంది.  ఇలాంటి తరుణంలో బీజేపీ నేత రఘురాం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

వల్లభనేని వంశీతో పాటు టీడీపీకి చెందిన మరో నేత గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీ, వైసీపీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారని రఘురాం బాంబ్ పేల్చారు. బీజేపీలో చేరాలనుకునే నేతలు ధైర్యంగా చేరవచ్చని.. వైసీపీ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని.. తాము రక్షణగా ఉంటామని రఘురాం చెప్పారు. టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్న రఘురాం.. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ.. భవిష్యత్తు మాత్రం బీజేపీదేనని జోస్యం చెప్పారు. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మోదీకి చంద్రబాబు ఫిర్యాదు చేస్తారో లేదో చూడాల్సి ఉంది.