AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విడాకుల బాటలో సల్మాన్ ఖాన్ హీరోయిన్..

సినీ జీవుల పెళ్లిళ్లు సినీమా వివాహాలుగానే మిగిలిపోతున్నాయి… ఎంతో అన్యోన్యంగా కనిపించే బాలీవుడ్ జంటలు ఆకస్మికంగా విడాకులు తీసుకుంటూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు.. తాజాగా మరో బాలీవుడ్ నటి కూడా తన వైవాహిక జీవితం బ్రేకప్ అయింది..అంటూ ప్రకటించింది.

విడాకుల బాటలో సల్మాన్ ఖాన్ హీరోయిన్..
Jyothi Gadda
|

Updated on: Feb 29, 2020 | 10:42 AM

Share

సినీ జీవుల పెళ్లిళ్లు సినీమా వివాహాలుగానే మిగిలిపోతున్నాయి… ఎంతో అన్యోన్యంగా కనిపించే బాలీవుడ్ జంటలు ఆకస్మికంగా విడాకులు తీసుకుంటూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు.. బాలీవుడ్‌ నటి, రచయిత్రి, దర్శకురాలు కొంకణా సేన్‌ శర్మ ఆమె భర్త రణ్‌వీర్‌ షోరే విడాకులకు అప్లై చేశారు. 5 సంవత్సరాలుగా విడివిడిగా ఉంటున్న ఈ జంట పరస్పర అంగీకారం మేరకు విడిపోవాలని నిశ్చయించుకున్నారు. తాజాగా మరో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కూడా తన వైవాహిక జీవితం బ్రేకప్ అయింది..

‘కబూతర్‌ జా..జా..జా..’ అంటూ…‘మైనే ప్యార్‌ కియా’ వంటి ఎవర్‌గ్రీన్ క్లాసిక్ మూవీతో బాలీవుడ్‌లో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ. ఈ సినిమా తో కుర్రాళ్లకు కంటికిమీద కునుకు లేకుండా చేసిన భాగ్యశ్రీ, 1990లో వ్యాపారవేత్త హిమాలయా దస్సానీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాల్లో మాత్రమే ఆమె నటించింది. తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన ‘యువరత్న రాణా’ సినిమాలో నటించింది. భాగ్యశ్రీ తెలుగులో చేసిన ఏకైక చిత్రం ఇదే. ఇక భర్తే తన లోకమనుకుని సినిమా ప్రపంచంవైపు కన్నెత్తి కూడా చూడలేదామె. అయితే తాజాగా భర్త నుంచి విడిపోయినట్లు ప్రకటించడం విశేషం.

‘అవును, నాకు తొలిసారిగా ప్రేమ పుట్టింది హిమాలయా పైనే. అతణ్ణే పెళ్లాడాను కూడా. కానీ ఒకానొక సందర్భంలో మేం విడిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అప్పుడు నా మనసు కుంగిపోయింది. అంటే నా జీవితంలో అతనికి ఇంక చోటు లేదా? నేను మరొకరిని పెళ్లి చేసుకోవాల్సిందేనా? అని ఊహించుకుంటే చాలు.. ఇప్పటికీ భయంతో వెన్నులో వణుకుపుడుతోంది.. ఎందుకంటే, మేం విడిపోయి ఏడాదిన్నర కాలం గడిచిపోయింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. భాగ్యశ్రీకి కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు అభిమన్యు దస్సానీ గతేడాది ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ చిత్రంతో కథానాయకుడిగా హిందీ చిత్రపరిశ్రమకు పరిచయమయ్యాడు. కాగా, భాగ్యశ్రీ తన రెండో ఇన్నింగ్స్ ను టాలీవుడ్ మూవీ తో ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమాలో ప్రభాస్ తల్లిగా కనిపించనుంది భాగ్యశ్రీ..