‘తేనేటీగలు’ లేకపోతే మనుగడ కష్టం.. కారణం తెలిస్తే షాక్..!!

ఏంటీ షాక్‌ అయ్యారా..! తేనేటీగలు లేకపోతే.. మనుషుల మనుగడ కష్టమవుతుందా..? అవునా అంటే నిజమేనని అంటున్నారు జియోగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ లండన్ శాస్ర్తవేత్తలు. జీవ జాతుల్లో అంత్యంత ముఖ్యమైన విలువైన జీవి ఏదంటే.. ‘తేనెటీగ’ అని లండన్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ తేనెటీగల విషయం ఎందుకొచ్చిందంటే.. తేనెటీగలపై తాజాగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనుగొన్నారు. ప్రస్తుతం.. తేనెటీగలు ప్రపంచవ్యాప్తంగా వాటి ఉనికిని కోల్పోయే ప్రమాదమొచ్చిందట. ఇటీవలే శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాల ప్రకారం […]

'తేనేటీగలు' లేకపోతే మనుగడ కష్టం.. కారణం తెలిస్తే షాక్..!!
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2019 | 5:51 PM

ఏంటీ షాక్‌ అయ్యారా..! తేనేటీగలు లేకపోతే.. మనుషుల మనుగడ కష్టమవుతుందా..? అవునా అంటే నిజమేనని అంటున్నారు జియోగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ లండన్ శాస్ర్తవేత్తలు. జీవ జాతుల్లో అంత్యంత ముఖ్యమైన విలువైన జీవి ఏదంటే.. ‘తేనెటీగ’ అని లండన్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ తేనెటీగల విషయం ఎందుకొచ్చిందంటే.. తేనెటీగలపై తాజాగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనుగొన్నారు.

ప్రస్తుతం.. తేనెటీగలు ప్రపంచవ్యాప్తంగా వాటి ఉనికిని కోల్పోయే ప్రమాదమొచ్చిందట. ఇటీవలే శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాల ప్రకారం 90 శాతం తేనెటీగలు అంతరించిపోయినట్టు వెల్లడించారు. పురుగుమందుల వాడకం, చెట్ల నరికివేతతో వాటికి అనుగుణంగా గూళ్లు కట్టుకునేందుకు స్థావరాలు లేక, అలాగే.. వాతావరణంలో వస్తోన్న మార్పులకనుగుణంగా కూడా తేనెటీగలు వాటి ఉనికిని కోల్పోతున్నట్టు చెప్పారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తేనెటీగలు మొత్తానికి అంతరించిపోతే.. ఆ తర్వాత మనుషులు.. కేవలం జీవించేది నాలుగేళ్లేనని.. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అధ్యయనాల్లో తేలింది. దీన్ని బట్టి మానవ మనుగడకు.. తేనెటీగల మనుగడకు చాలా కష్టమవుతుందని అర్థమవుతోంది. అలాగే.. మానవాళికి.. రోగాలు వ్యాప్తి చేయని ఏకైక జీవి కూడా.. తేనెటీగనే. వాటి.. తేనె తుట్టిలను కదిలిస్తే.. తప్పించి.. అవి సాధారణంగా మనుషులపై దాడి చేయవు.

కాగా.. వాతావరణ కాలుష్యం, టెక్నాలజీ పెరిగిపోవడం.. కూడా ఒక కారణంగా.. శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. ముఖ్యంగా సెల్‌ఫోన్ల వినియోగం వల్ల.. ఇప్పటికే చాలా జీవ జాతులు అంతరించిపోయాయి. ఇప్పటికే.. సెల్‌ఫోన్స్ సిగ్నల్స్ తరంగాల ద్వారా.. పిచ్చుకలు అంతరించిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాల్లో.. వాటి శబ్దం కూడా వినిపించడంలేదు. రోబో 2.0 సినిమాలో చూపించినట్టు.. ఒక రకంగా.. ఇది కూడా వాటికి హానికరమైన చర్యనే. అయితే.. తేనెటీగల ఉనికిని కాపాడుకునేందుకు.. చెట్ల నరికివేతను తగ్గించి, గ్రీనరీని పెంచి.. సహజమైన పద్దతుల ద్వారా వ్యవసాయాన్ని పండిస్తే.. తేనెటీగలను కాస్త కాపాడుకోవచ్చని.. లండన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సో.. తేనెటీగలను.. బ్రతికించి.. మనమూ జీవిద్దాం.