AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్‌కు కరోనా కష్టం : మెడికల్ అధికారికి కరోనా పాజిటివ్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ కు కరోనా అడుగడునా అడ్డుపడుతోంది. కరోన భయంతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి దుబాయ్‌కు చేరింది. అక్కడికి చేరిన ఐపీఎల్‌ను కోవిడ్ రక్కసి మాత్రం వదలడం లేదు.

ఐపీఎల్‌కు కరోనా కష్టం : మెడికల్ అధికారికి కరోనా పాజిటివ్
Sanjay Kasula
|

Updated on: Sep 03, 2020 | 1:23 PM

Share

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ కు కరోనా అడుగడునా అడ్డుపడుతోంది. కరోన భయంతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి దుబాయ్‌కు చేరింది. అక్కడికి చేరిన ఐపీఎల్‌ను కోవిడ్ రక్కసి మాత్రం వదలడం లేదు. ఇప్పటి వరకూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)ను కలవర పెట్టిన కరోనా.. తాజాగా భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(BCCI)కు పాకింది.

బీసీసీఐ మెడికల్‌ టీమ్‌లోని సభ్యునికి కరోనా సోకిందని బీసీసీఐ ధృవీకరించింది. ఐపీఎల్‌ కోసం యూఏఈకి వెళ్లిన తర్వాత 13 మంది సీఎస్‌కే సభ్యులు కరోనా బారిన పడ్డారు. కాగా, రెండు రోజుల క్రితం నిర్వహించిన టెస్టుల్లో వారికి కరోనా నెగిటివ్‌ రావడంతో సీఎస్‌కే జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

అయితే.. కరోనా సోకిన మెడికల్ అధికారి క్షేమంగా ఉన్నారని బోర్డు వెల్లడించింది.  అతనికి ప్రస్తుతం ఎలాంటి ప్రాబ్లం ఏమీ లేదని పేర్కొంది. అతను ఐసోలేషన్‌లో ఉన్నాడని వెల్లడించింది. ఎవరితోనూ అతని కాంటాక్ట్‌ లేదని… యూఏఈకి వెళ్లే సమయంలో కూడా ఏ క్రికెటర్‌తోనూ అతను కాంటాక్ట్‌ కాలేడని ప్రకటించింది. ఆ మెడికల్‌ ఆఫీసర్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని… తదుపరి టెస్టుల నాటికి అతనికి నెగిటివ్‌ వస్తుందని ఆశిస్తున్నాం అని బీసీసీఐ పేర్కొంది.