AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామ‌మందిర భూమి పూజ‌.. ప్ర‌పంచం మొత్తం వీక్షించేలా..!

ఆగ‌స్టు 5న అయోధ్యలో ప్రతిపాదిత రామ‌జన్మభూమిలో నిర్మించ‌బోయే రామాల‌యానికి సంబంధించిన‌ భూమిపూజా కార్య‌క్ర‌మాల‌ను దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ  కార్య‌క్ర‌మానికి ప్రధాని నరేంద్ర మోదీ

రామ‌మందిర భూమి పూజ‌.. ప్ర‌పంచం మొత్తం వీక్షించేలా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 27, 2020 | 12:05 PM

Share

Ayodhya Ram temple bhoomi pujan: ఆగ‌స్టు 5న అయోధ్యలో ప్రతిపాదిత రామ‌జన్మభూమిలో నిర్మించ‌బోయే రామాల‌యానికి సంబంధించిన‌ భూమిపూజా కార్య‌క్ర‌మాల‌ను దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ  కార్య‌క్ర‌మానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజ‌రుకానున్నారు. రామ‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం రామాల‌య భూమి పూజా కార్య‌క్ర‌మాలన్నింటినీ దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రసారం చేయనుంది.

కరోనా సంక్షోభ నేపథ్యంలో.. అయోధ్యకు ప్ర‌జ‌లు త‌ర‌లిరావ‌ద్ద‌ని రాయ్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి, రామాల‌య భూమి పూజను చూడాలని, పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. ఆగ‌స్టు 5న భారతదేశంలోని రామ‌భక్తులు, సాధువులు తాము ఉంటున్న ప్ర‌దేశంలోనే పూజలు చేస్తారని రాయ్ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేసేందుకు ఇతర ఛాన‌ళ్లు కూడా సన్నాహాలు చేస్తున్నాయన్నారు.

Read More: 

గుడ్ న్యూస్: సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు పాస్‌ మార్కులు..

గుడ్ న్యూస్: ఇక కామర్స్‌, ఆర్ట్స్‌ విద్యార్థులకూ ‘గేట్‌’ రాసే అవకాశం..!