AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విదేశీ వస్తువులను ఎలా నిషేదించాలి.? మీరే చెప్పాలి అమిత్ జీ..

దేశ ప్రజలు విదేశీ వస్తువులను కొనకుండా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ విమర్శలు గుప్పించారు.

విదేశీ వస్తువులను ఎలా నిషేదించాలి.? మీరే చెప్పాలి అమిత్ జీ..
Ravi Kiran
|

Updated on: Jun 03, 2020 | 4:12 PM

Share

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తాజాగా దేశ ప్రజలు విదేశీ వస్తువులను కొనకుండా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ విమర్శలు గుప్పించారు. ‘అమిత్ షా జీ.. విదేశీ వస్తువులను ఎలా బహిష్కరించాలో విడమర్చి చెబుతారా?’ అని ట్వీట్ చేశారు. వివిధ రంగాల్లో మీరే FDIలకు అనుమతి ఇస్తున్నారు. 88 శాతం మొబైల్ ఫోన్ల తయారీలో ఉపయోగించుకునే పరికరాలు, 70 శాతం ఔషద తయారీకి కావాల్సిన బల్క్ డ్రగ్స్, 60 శాతం వైద్య పరికరాల్ని కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మరి ఇలాంటిప్పుడు విదేశీ వస్తువులను ఎలా నిషేదించాలి అని అమిత్ షాను ఓవైసీ ప్రశ్నించారు.

అటు తబ్లీగి జమాత్ సమావేశాలపై కూడా స్పందించిన ఓవైసీ.. తబ్లిఘీలపై ప్రశంసలు కురిపించారు. సుమారు 38 మంది తబ్లీఘీ జమాత్ సభ్యులు ప్లాస్మా దానం చేయడానికి సిద్దంగా ఉన్నారని.. వీరిలో 25 మంది తెలంగాణవాసులని ఓవైసీ తెలిపారు. అయితే కొంతమంది తబ్లిఘీ జమాత్‌ను సూపర్ స్ప్రెడర్లుగా.. కరోనా జీహాదీలుగా ఆరోపించారని మండిపడ్డారు.

Also Read:

ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..

కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు… రికవరీ రేటు కూడా సూపర్!

కరోనా లక్షణాలు పద్నాలుగు.. తేల్చి చెప్పిన ఐసీఎంఆర్..!

ఏపీలో జూలై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. విద్యార్ధుల కోసం 8 లక్షల మాస్కులు..

వారికి ఓపిక లేకనే కాలి నడకన ఇళ్లకు బయల్దేరారు..