హడావిడి షురూ..

గవర్నర్‌గా నియామకం అయిన తర్వాత.. తొలిసారి ఏపీకి వచ్చిన హరి చందన్ తొలుత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేణిగుంట నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న గవర్నర్‌కు సీఎం జగన్, సీఎస్, డీజీపీ పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసింది […]

హడావిడి షురూ..
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2019 | 8:11 PM

గవర్నర్‌గా నియామకం అయిన తర్వాత.. తొలిసారి ఏపీకి వచ్చిన హరి చందన్ తొలుత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేణిగుంట నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న గవర్నర్‌కు సీఎం జగన్, సీఎస్, డీజీపీ పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసింది ఏపీ సర్కార్. అధికారిక నివాసం రాజ్ భవన్‌ను ముస్తాబు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే గవర్నర్ కొత్త రాజ్ భవన్‌లో ఉండనున్నారు.