AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రైవేట్ స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్…

ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న పరిస్థితులలో అడ్మిషన్ల కోసం టీచర్లను వేధించడం...

ప్రైవేట్ స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్...
Ravi Kiran
|

Updated on: Jun 27, 2020 | 9:19 AM

Share

ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న పరిస్థితులలో అడ్మిషన్ల కోసం టీచర్లను వేధించడం, విద్యార్థుల ఇళ్లకు పంపించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు సంఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది.

ఇలాంటి విపత్కర సమయంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు టీచర్ల జీతాల్ని అడ్మిషన్లతో ముడిపెట్టడం సరికాదని తెలిపింది. ఈ విషయంపై తాజాగా ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ ఆర్.కాంతారావు అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో వారు తీసుకున్న పలు కీలక నిర్ణయాలను సిఫార్సుల రూపంలో ప్రభుత్వానికి నివేదించారు.

కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు అడ్మిషన్ల కోసం తమ సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా వారి జీతాన్ని అడ్మిషన్లకు ముడిపెట్టి ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే సంబంధిత పాఠశాలలు, కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామని కమిషన్ హెచ్చరించింది.

Also Read:

రైల్వే ప్రయాణీకులకు శుభవార్త..

వారికి ఉచితంగా ఇసుక.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు..

‘బిగ్ బాస్ 4’కు హోస్టుగా సమంతా..?