ఏపీలో తగ్గిన కరోనా ఉధృతి, కొత్తగా 3,224 పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 3,224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 32 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.
ఏపీలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 3,224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 32 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. మెుత్తం కరోనా కేసుల సంఖ్య 7,58,951కు చేరింది. వైరస్తో ఇప్పటివరకు 6,256 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 43,983 యాక్టివ్ కేసులున్నాయి. వ్యాధి నుంచి ఇప్పటివరకు 7,08,712 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 61,112 మందికి కరోనా టెస్టులు చేయగా.. ఇప్పటివరకు 66,30,728 టెస్టులు పూర్తి చేసినట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది.
Also Read :
పిల్లి పిల్ల అనుకుని కొన్నారు..తీరా రెండేళ్ల తర్వాత..!