AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ సర్కార్ అభివ‌ృద్ధి మంత్రం.. ప్రతి గిరిజన గూడేనికీ ఇంటర్‌నెట్‌ సౌకర్యం.. సచివాలయ వ్యవస్థకు మహా బలం

అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని మూల మూలకు తమ పథకాలను అందించే లక్ష్యంతో దూసకుపోతున్నారు ముఖ్యమంత్రి జగన్.

జగన్ సర్కార్ అభివ‌ృద్ధి మంత్రం.. ప్రతి గిరిజన గూడేనికీ ఇంటర్‌నెట్‌ సౌకర్యం.. సచివాలయ వ్యవస్థకు మహా బలం
Sanjay Kasula
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Nov 22, 2020 | 3:10 PM

Share

Net Connectivity to Tribal Village :  అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని మూల మూలకు తమ పథకాలను అందించే లక్ష్యంతో దూసకుపోతున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి గిరిజన గూడేనికీ ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలనే ఓ మంచి సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.

ఎక్కడో విసిరేసినట్లుగా ఉండే గిరి శిఖర గ్రామాలకు సైతం ఇంటర్‌నెట్‌ సేవల్ని అందించేందుకు రాష్ర సర్కార్ ప్రత్యేక దృష్టిని పెడుతోంది. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ నిర్వహణకు ఇంటర్‌ నెట్‌ తప్పనిసరి కావడంతో ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రతి గిరిజన గ్రామానికీ డిజిటల్ సౌకర్యంను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఫైబర్ నెట్ కనెక్టివిటీని ఆంధ్రప్రదేశ్‌లోని 134 గిరిజన గూడేలతో ఇప్పటికే అనుసంధానించారు. ఈ వ్యవస్థను తర్వగా అందుబాటులోకి తెచ్చేందుకు రూ.3 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌కు చెల్లించింది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 51 గ్రామాలు, విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 49 గ్రామాలు, విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 26 గ్రామాలు, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో 6 గ్రామాలు, చింతూరు, కేఆర్‌ పురం ఐటీడీఏల పరిధిలో ఒక్కో గ్రామంలో ఫైబర్‌ నెట్‌ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. ఇప్పటికే కొండ ప్రాంతాల్లో ప్రభుత్వ సహకారంతో రిలయన్స్‌ సంస్థ 200కు పైగా టవర్స్‌ ఏర్పాటు చేసిందని వారు తెలిపారు. వీటిద్వారా సమీప ఏజెన్సీ గ్రామాల్లో వైర్‌లెస్‌ ఇంటర్‌నెట్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి.