AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లాష్ న్యూస్: మరో పరిశ్రమలో గ్యాస్ లీక్ కలకలం..

తెలంగాణలోని ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ ఎస్పీఎం పేపర్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. సిఎల్ఓ 2 ఫ్లాట్ వద్ద ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. పేపర్ 1, 2. ఫ్లాట్లకు వెళుతున్న క్లోరిన్ లీకవడంతో సమీపంలో విధులు నిర్వహిస్తున్న 20 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాయిలర్‌కు అత్యంత సమీపంలో క్లోరీన్ గ్యాస్ లీకవడంతో ఒక్కసారిగా కార్మికులు పరుగులు తీశారు. ఒక్కరు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటహుటిన […]

ఫ్లాష్ న్యూస్: మరో పరిశ్రమలో గ్యాస్ లీక్ కలకలం..
Ravi Kiran
|

Updated on: May 11, 2020 | 1:01 PM

Share

తెలంగాణలోని ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ ఎస్పీఎం పేపర్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. సిఎల్ఓ 2 ఫ్లాట్ వద్ద ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. పేపర్ 1, 2. ఫ్లాట్లకు వెళుతున్న క్లోరిన్ లీకవడంతో సమీపంలో విధులు నిర్వహిస్తున్న 20 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాయిలర్‌కు అత్యంత సమీపంలో క్లోరీన్ గ్యాస్ లీకవడంతో ఒక్కసారిగా కార్మికులు పరుగులు తీశారు. ఒక్కరు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటహుటిన సమీపంలోని‌ ఓ ప్రైవేటు ఆస్పత్రికి‌ తరలించారు. ప్రస్తుతం ఆ కార్మికుడి పరిస్థితి క్షేమంగానే ఉన్నట్టు సమాచారం. మరో ముగ్గురు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్‌లో టెన్షన్..)

క్లోరిన్ గాఢత తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన పై స్పందించేందుకు జేకే పేపర్ మిల్ యాజమాన్యం నిరాకరించింది. లాక్ డౌన్ కావడంతో పూర్తి స్థాయిలో బాయిలర్స్ వినియోగంలో లేకపోవడం పేపర్ బ్రైట్ నెస్ పెంచేందుకు వినియోగించే క్లోరీన్ లిక్విడ్ ఉష్ణోగ్రత 15 డిగ్రీలు మించడంతో ఈ ఘటన జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు బయటకి పొక్కకుండా జేకే పేపర్ మిల్ యాజమాన్యం జాగ్రత్తలు చేపట్టింది. ఘటన జరగడంతో అలర్ట్ అయిన సిర్పూర్ పేపర్ మిల్ జేకే యాజామాన్యం కార్మికులను అర్థాంతరంగా ఇంటికి పంపించింది. దీంతో పేపర్ మిల్లులో ఏం జరుగుతుందో అనుమానాలు గుప్పుమంటున్నాయి.   (డేంజర్ బెల్స్: మరో రెండు వారాల లాక్‌డౌన్‌కు సిద్దంకండి..)

Read More:

నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

హిందూ మతంలోకి మారిన 250 మంది ముస్లింలు.!