ఈఎస్ఐ స్కాంలో కొత్త ట్విస్ట్.. బట్టబయలైన మరికొందరి బాగోతాలు
ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐ స్కాం లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్తగా 6.5 కోట్ల రూపాయల అక్రమాలను గుర్తించిన ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ఈఎస్ఐ మందుల కొనుగులు లోనే ఈ భారీ స్కాం గుర్తించారు..
ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐ స్కాం లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్తగా 6.5 కోట్ల రూపాయల అక్రమాలను గుర్తించిన ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ఈఎస్ఐ మందుల కొనుగులు లోనే ఈ భారీ స్కాం గుర్తించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ స్కామ్ లో మరికొంత మందిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. వీరిలో కంచర్ల శ్రీ హరి బాబూ అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్, ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవిక రాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్ట్ంట్ డైరెక్టర్ కే వసంత ఇందిరా ల పై తాజాగా కేసులు నమోదు అయ్యాయి. 12చోట్ల నిందితుల ఇళ్లలో, కార్యాలయాలలో ఏక కాలంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ ఈ మేరకు అక్రమాలు గుర్తించింది. అక్రమ లావాదేవీలతో ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో నష్టం చేకూర్చారంటూ అభియోగాలు నమోదు చేసింది ఏసీబీ. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
తెలంగాణలో వెలుగుచూసిన ఈఎస్ఐ స్కాం లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్తగా 6.5 కోట్ల రూపాయల అక్రమాలను గుర్తించిన ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ఈఎస్ఐ మందుల కొనుగులు లోనే ఈ భారీ స్కాం గుర్తించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ స్కామ్ లో మరికొంత మందిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. వీరిలో కంచర్ల శ్రీ హరి బాబూ అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్, ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవిక రాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్ట్ంట్ డైరెక్టర్ కే వసంత ఇందిరా ల పై తాజాగా కేసులు నమోదు అయ్యాయి. 12చోట్ల నిందితుల ఇళ్లలో, కార్యాలయాలలో ఏక కాలంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ ఈ మేరకు అక్రమాలు గుర్తించింది. అక్రమ లావాదేవీలతో ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో నష్టం చేకూర్చారంటూ అభియోగాలు నమోదు చేసింది ఏసీబీ.