AP News: ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ కాస్ట్(కుల ధృవీకరణ) పత్రం కోసం తిరగాల్సిన పనిలేదు. ఇక నుంచి కుల ధృవీకరణ పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించాలని జగన్ సర్కార్ యోచిస్తోంది.

AP News: ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్..

Updated on: Feb 29, 2020 | 2:29 PM

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ కాస్ట్(కుల ధృవీకరణ) పత్రం కోసం తిరగాల్సిన పనిలేదు. ఇక నుంచి ఆ సర్టిఫికెట్లను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించాలని జగన్ సర్కార్ యోచిస్తోంది. దీనిపై అధికారులు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు.

మున్ముందు కుల ధృవీకరణ పత్రాలు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే జారీ కానున్నాయి. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి అన్ని సర్టిఫికెట్లను డిప్యూటీ తహశీల్దార్, జిల్లా కలెక్టర్లు మంజూరు చేస్తూ వచ్చారు. ఇక నుంచి ఆ సర్టిఫికెట్లను జారీ చేసే అధికారులను గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం అప్పగించనుంది. కాగా, ఇతర రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగ అవసరాల కోసం ఇచ్చే సర్టిఫికెట్లను మాత్రం తహశీల్దార్, అంతకన్నా పైస్థాయి అధికారి మంజూరు చేయాల్సి ఉంది. మార్చి నెలాఖరు నుంచి ఈ విధానం అమలులోకి రానుంది.

For More News:

విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్…

కాషాయ పార్టీకి కరెన్సీ వెల్లువ.. రూ 742 కోట్లతో అందనంత ఎత్తున..

అలెర్ట్: మార్చిలో ఏకంగా 19 రోజులు బ్యాంకుల సేవలు బంద్…

Loading...
Unable to load recommendations.
Follow Us