AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ : తుంగభద్ర పుష్కరాలకు మరో రూ.2 కోట్లు విడుదల

 తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో సౌకర్యాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిధులు కేటాయించింది.

ఏపీ : తుంగభద్ర పుష్కరాలకు మరో రూ.2 కోట్లు విడుదల
Ram Naramaneni
|

Updated on: Nov 10, 2020 | 10:47 PM

Share

తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో సౌకర్యాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిధులు కేటాయించింది. ఇరిగేషన్‌ శాఖ అధ్వర్యంలో ఇప్పటికే మెట్లు, బారికేడ్లు, మెస్‌ పనులు మొదలయ్యాయి. తాజాగా మరో రూ.2 కోట్లు కేటాయిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 13 ఘాట్ల వద్ద తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేసింది. భక్తులకు తాత్కాలికంగా మరుగుదొడ్లు, ఇతర వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.  ఈ నెల 13 నాటికి పుష్కర ఘాట్లు, ఏర్పాట్లు పూర్తి చేస్తామని కర్నూలు జిల్లా వీరపాండియన్ తెలిపారు.

తుంగభద్ర పుష్కరాల సందర్భంగా నదిలో స్నానానికి అనుమతి లేదని దేవాదాయశాఖ స్పష్టం చేసింది. దీనివల్ల కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని తెలిపింది. అయితే నది ఒడ్డున, అక్కడి ఆలయాల వద్ద పిండ ప్రదానం వంటి వైదిక కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. కర్నూలు జిల్లాలో నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు పుష్కరాలు నిర్వహిస్తున్నారు.  నది ఒడ్డున ఉండే ఆలయాల్లో దర్శనాలకు వచ్చే భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.

Also Read : 

ఏపీ : ఇమాంలు, మౌజమ్‌లకు గౌరవ వేతనం విడుదల

ఏపీ :వారి అకౌంట్ల‌లో నేరుగా రూ.10వేలు జమ

ఏపీలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు