సీఎం జగన్ కీలక నిర్ణయం..కరోనా వారియర్స్ కు పూర్తి జీతం…
కరోనా లాక్డౌన్తో ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనంగా లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతల్లో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణంయించింది. ఈ క్రమంలో సీఎం జగన్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడిలో కీలక పాత్ర వహిస్తోన్న వైద్య ఆరోగ్య, శానిటరీ, పోలీస్ సిబ్బందికి పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రాణాలకు తెగించి పోరాడుతోన్న వారి జీతాలను వాయిదా వేయడం సరికాదని సీఎం జగన్ అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో […]
కరోనా లాక్డౌన్తో ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనంగా లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతల్లో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణంయించింది. ఈ క్రమంలో సీఎం జగన్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడిలో కీలక పాత్ర వహిస్తోన్న వైద్య ఆరోగ్య, శానిటరీ, పోలీస్ సిబ్బందికి పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రాణాలకు తెగించి పోరాడుతోన్న వారి జీతాలను వాయిదా వేయడం సరికాదని సీఎం జగన్ అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా…వారి చేస్తోన్న సేవలు గొప్పవని..అందుకే మొత్తం జీతాలు చెల్లించాలని సీఎం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.