AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆహ్లాదంగా ఉండే గోదావరి తీరంలో.. ఉదయాన్నే భయానక దృశ్యం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామంలోని గోదావరి తీరంలో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు అనుమానిస్తున్న ఆనవాళ్లు కలకలం రేపాయి. బొమ్మకు మేకులు గుచ్చి, పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పాటు జంతు బలి ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.

Telangana: ఆహ్లాదంగా ఉండే గోదావరి తీరంలో.. ఉదయాన్నే భయానక దృశ్యం..
Alleged Black Magic Rituals
N Narayana Rao
| Edited By: |

Updated on: Jun 28, 2026 | 9:22 AM

Share

ఎప్పుడూ ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా కనిపించే గోదావరి తీరం ఒక్కసారిగా భయానక వాతావరణాన్ని సంతరించుకుంది. తెల్లవారుజామున గోదావరి తీరానికి వెళ్లిన స్థానికులు అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రక్తపు మరకలు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఓ బొమ్మకు మేకులు గుచ్చిన ఆనవాళ్లు కనిపించడంతో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామ పరిధిలోని గోదావరి తీరంలో చోటుచేసుకుంది. ఉదయం నదీ తీరానికి వెళ్లిన కొందరు స్థానికులు అక్కడి పరిస్థితులను గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పరిశీలించగా, భయానక దృశ్యాలు కనిపించాయి.

ఘటనా స్థలంలో ఓ బొమ్మను ఉంచి దానికి మేకులు గుచ్చినట్లు కనిపించింది. చుట్టూ పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు నిర్వహించిన ఆనవాళ్లు ఉన్నాయి. అంతేకాకుండా కోళ్లు, మేకలను బలిచ్చినట్లు రక్తపు మరకలు, ఇతర ఆనవాళ్లు కూడా కనిపించాయి. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ దృశ్యాలను చూసిన గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంత భయంకరంగా క్షుద్ర పూజలు నిర్వహించిన ఘటనను గతంలో ఎప్పుడూ చూడలేదని వారు చెబుతున్నారు. గోదావరి తీరం వంటి పవిత్ర ప్రదేశాన్ని ఇలాంటి కార్యకలాపాలకు వినియోగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. ఫిర్యాదు అనంతరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఈ క్షుద్ర పూజలు ఎవరు నిర్వహించారు? వాటి వెనుక ఉద్దేశం ఏమిటి? అనే కోణంలో దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ఎప్పుడూ ప్రశాంతంగా, ప్రకృతి అందాలతో కళకళలాడే గోదావరి పరిసరాలు ఒక్కసారిగా క్షుద్ర పూజల ఆనవాళ్లతో కలకలం రేపడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తులు ఎవరనే దానిపై గ్రామంలో చర్చ జరుగుతుండగా, నిజానిజాలు పోలీసుల దర్యాప్తులోనే తేలనున్నాయి.

Follow Us
మేకులు దింపిన బొమ్మ.. పక్కనే బలి ఇచ్చిన మేక.. బాబోయ్..
మేకులు దింపిన బొమ్మ.. పక్కనే బలి ఇచ్చిన మేక.. బాబోయ్..
బైక్ పోయిందని వ్యక్తి ఫిర్యాదు విచారణ చేస్తుండగా...
బైక్ పోయిందని వ్యక్తి ఫిర్యాదు విచారణ చేస్తుండగా...
బుధుడు వక్రగతిలోకి.. ఈ 3 రాశుల వారికి 25 రోజులు కష్టకాలం, డబ్బు..
బుధుడు వక్రగతిలోకి.. ఈ 3 రాశుల వారికి 25 రోజులు కష్టకాలం, డబ్బు..
స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని ఆపిన పోలీసులు.. తనిఖీ చేయగా
స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని ఆపిన పోలీసులు.. తనిఖీ చేయగా
ఐర్లాండ్‌పై పరువుపోకుండా ఉండాలంటే.. ఈ 3 తప్పులు మారాల్సిందే..?
ఐర్లాండ్‌పై పరువుపోకుండా ఉండాలంటే.. ఈ 3 తప్పులు మారాల్సిందే..?
ఆ చీమ గుడ్ల కూర కోసం ఎగబడుతున్న జనాలు.. గిరిజనుల హెల్త్ సీక్రెట్
ఆ చీమ గుడ్ల కూర కోసం ఎగబడుతున్న జనాలు.. గిరిజనుల హెల్త్ సీక్రెట్
నాగుపాములతో ఒకే ఇంట్లో కాపురం..భారతదేశంలోని ఈ వింత గ్రామం చూశారా?
నాగుపాములతో ఒకే ఇంట్లో కాపురం..భారతదేశంలోని ఈ వింత గ్రామం చూశారా?
శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ?
శ్రేయస్ అయ్యర్‌ మీద వైభవ్‎కు అంత కోపముందా ?
టీ vs కాఫీ.. ఇదో పెద్ద మైండ్ గేమ్.. మీ ఛాయిస్‌ను బట్టి మీరు ఎలాంట
టీ vs కాఫీ.. ఇదో పెద్ద మైండ్ గేమ్.. మీ ఛాయిస్‌ను బట్టి మీరు ఎలాంట
అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు..అడ పులులదే రాజ్యం
అమ్రాబాద్‌లో రికార్డు స్థాయిలో పులుల గుర్తింపు..అడ పులులదే రాజ్యం