AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: టికెట్ ఉన్నా ఈ భారతీయ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టలేరు.. ఎందుకో తెలుసా..?

Indian Railways: భారతదేశంలో ఎన్నో వైవిధ్యమైన రైల్వే స్టేషన్లు ఉన్నప్పటికీ, ఈ స్టేషన్ ప్రాధాన్యత పూర్తి భిన్నమైనది. కేవలం రైలు ప్రయాణానికి మాత్రమే కాకుండా, దేశ రక్షణకు, అంతర్జాతీయ సరిహద్దుల నిర్వహణకు ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుంది. టికెట్ ఉన్నా పాస్‌పోర్ట్ లేకపోతే అడుగుపెట్టనివ్వని ఈ స్టేషన్, భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత రక్షణ కలిగిన ప్రత్యేక వేదికగా గుర్తింపు పొందింది.

Venkata Chari
|

Updated on: Jun 28, 2026 | 8:25 AM

Share
Indian Railways Security: భారతదేశంలో రైలు ప్రయాణం అంటే గుర్తొచ్చేది కిక్కిరిసిన ప్లాట్‌ఫారాలు, కూలీల హడావుడి. కానీ, మన దేశంలోనే ఒక విచిత్రమైన రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ ప్రయాణానికి చెల్లుబాటయ్యే కన్ఫర్మ్ టికెట్ ఉన్నప్పటికీ, మీరు అంత సులభంగా లోపలికి అడుగు పెట్టలేరు. భద్రతా బలగాల పహారా, అంతర్జాతీయ సరిహద్దు నిబంధనల నడుమ నడిచే ఆ ప్రత్యేక స్టేషనే పంజాబ్‌లోని అటారీ రైల్వే స్టేషన్.

Indian Railways Security: భారతదేశంలో రైలు ప్రయాణం అంటే గుర్తొచ్చేది కిక్కిరిసిన ప్లాట్‌ఫారాలు, కూలీల హడావుడి. కానీ, మన దేశంలోనే ఒక విచిత్రమైన రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ ప్రయాణానికి చెల్లుబాటయ్యే కన్ఫర్మ్ టికెట్ ఉన్నప్పటికీ, మీరు అంత సులభంగా లోపలికి అడుగు పెట్టలేరు. భద్రతా బలగాల పహారా, అంతర్జాతీయ సరిహద్దు నిబంధనల నడుమ నడిచే ఆ ప్రత్యేక స్టేషనే పంజాబ్‌లోని అటారీ రైల్వే స్టేషన్.

1 / 5
టికెట్‌తో పాటు అవి ఉంటేనే ఎంట్రీ..: సాధారణంగా భారతదేశంలో ఏ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాలన్నా ప్లాట్‌ఫారమ్ టికెట్ లేదా ప్రయాణ టికెట్ ఉంటే సరిపోతుంది. కానీ, అటారీ రైల్వే స్టేషన్ పరిధిలోకి వెళ్లాలంటే మాత్రం అది సరిపోదు. మీ దగ్గర ఎంత ఖరీదైన రైలు టికెట్ ఉన్నా.. దాంతో పాటు చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్, వీసా తప్పనిసరిగా ఉండాలి. అంతర్జాతీయ ప్రయాణ పత్రాలు సరైన క్రమంలో ఉంటేనే భద్రతా సిబ్బంది మిమ్మల్ని స్టేషన్ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ఈ కఠిన నిబంధనల వల్ల ఇది ఒక సాధారణ రైల్వే స్టేషన్‌లా కాకుండా, అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్‌ను తలపిస్తుంది.

టికెట్‌తో పాటు అవి ఉంటేనే ఎంట్రీ..: సాధారణంగా భారతదేశంలో ఏ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాలన్నా ప్లాట్‌ఫారమ్ టికెట్ లేదా ప్రయాణ టికెట్ ఉంటే సరిపోతుంది. కానీ, అటారీ రైల్వే స్టేషన్ పరిధిలోకి వెళ్లాలంటే మాత్రం అది సరిపోదు. మీ దగ్గర ఎంత ఖరీదైన రైలు టికెట్ ఉన్నా.. దాంతో పాటు చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్, వీసా తప్పనిసరిగా ఉండాలి. అంతర్జాతీయ ప్రయాణ పత్రాలు సరైన క్రమంలో ఉంటేనే భద్రతా సిబ్బంది మిమ్మల్ని స్టేషన్ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ఈ కఠిన నిబంధనల వల్ల ఇది ఒక సాధారణ రైల్వే స్టేషన్‌లా కాకుండా, అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్‌ను తలపిస్తుంది.

2 / 5
కూలీలు లేని ఏకైక రైల్వే స్టేషన్..: దేశంలోని ఏ స్టేషన్‌లో చూసినా ఎర్రటి చొక్కాలు ధరించిన కూలీలు ప్రయాణికుల లగేజీని మోస్తూ కనిపిస్తారు. కానీ, అటారీ రైల్వే స్టేషన్‌లో కూలీలకు అస్సలు అనుమతి లేదు. భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుకు అతి సమీపంలో ఈ స్టేషన్ ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దేశ రక్షణను దృష్టిలో ఉంచుకుని, ఇక్కడ కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్ అమలు చేస్తారు. అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి కదలికలను నిఘా సంస్థలు, సరిహద్దు భద్రతా బలగాలు (BSF) నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. ఈ కారణంగానే సాధారణ స్టేషన్లలో లభించే కొన్ని ప్రజా సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉండవు.

కూలీలు లేని ఏకైక రైల్వే స్టేషన్..: దేశంలోని ఏ స్టేషన్‌లో చూసినా ఎర్రటి చొక్కాలు ధరించిన కూలీలు ప్రయాణికుల లగేజీని మోస్తూ కనిపిస్తారు. కానీ, అటారీ రైల్వే స్టేషన్‌లో కూలీలకు అస్సలు అనుమతి లేదు. భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుకు అతి సమీపంలో ఈ స్టేషన్ ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దేశ రక్షణను దృష్టిలో ఉంచుకుని, ఇక్కడ కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్ అమలు చేస్తారు. అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి కదలికలను నిఘా సంస్థలు, సరిహద్దు భద్రతా బలగాలు (BSF) నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. ఈ కారణంగానే సాధారణ స్టేషన్లలో లభించే కొన్ని ప్రజా సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉండవు.

3 / 5
భారత్-పాక్ అనుసంధాన వేదిక..: అటారీ రైల్వే స్టేషన్ అనేది కేవలం దేశీయ ప్రయాణాల కోసం నిర్మించినది కాదు. ఇది ఒకప్పుడు భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య నడిచిన చారిత్రాత్మక అంతర్జాతీయ రైలు సర్వీస్ "సమ్ఝౌతా ఎక్స్‌ప్రెస్"కు ప్రధాన కేంద్రంగా నిలిచింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, ప్రజల రాకపోకలకు ఈ స్టేషన్ సుదీర్ఘకాలం పాటు సాక్ష్యంగా నిలిచింది. సరిహద్దు దాటి అక్రమంగా చొరబాట్లు జరగకుండా చూడటం, సరైన అనుమతులు లేకుండా ఎవరూ సరిహద్దు దాటకుండా నిరోధించడమే ఇక్కడి నిఘా విభాగాల ముఖ్య విధి.

భారత్-పాక్ అనుసంధాన వేదిక..: అటారీ రైల్వే స్టేషన్ అనేది కేవలం దేశీయ ప్రయాణాల కోసం నిర్మించినది కాదు. ఇది ఒకప్పుడు భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య నడిచిన చారిత్రాత్మక అంతర్జాతీయ రైలు సర్వీస్ "సమ్ఝౌతా ఎక్స్‌ప్రెస్"కు ప్రధాన కేంద్రంగా నిలిచింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, ప్రజల రాకపోకలకు ఈ స్టేషన్ సుదీర్ఘకాలం పాటు సాక్ష్యంగా నిలిచింది. సరిహద్దు దాటి అక్రమంగా చొరబాట్లు జరగకుండా చూడటం, సరైన అనుమతులు లేకుండా ఎవరూ సరిహద్దు దాటకుండా నిరోధించడమే ఇక్కడి నిఘా విభాగాల ముఖ్య విధి.

4 / 5
అడుగడుగునా తనిఖీల పర్వం..: ఈ స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు విమాన ప్రయాణాన్ని మించిన తనిఖీలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లోపలికి ప్రవేశించే ముందే ప్రయాణికులకు సంబంధించిన ప్రతి వస్తువును అత్యాధునిక స్కానర్ల ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆ తర్వాత గుర్తింపు కార్డుల పరిశీలన, ఇమ్మిగ్రేషన్ విభాగం ఆంక్షలు, కస్టమ్స్ తనిఖీలు ఇలా పలు అంచెల భద్రతా వలయాలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ స్థాయి నిఘా ఏర్పాటు చేశారు.

అడుగడుగునా తనిఖీల పర్వం..: ఈ స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు విమాన ప్రయాణాన్ని మించిన తనిఖీలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లోపలికి ప్రవేశించే ముందే ప్రయాణికులకు సంబంధించిన ప్రతి వస్తువును అత్యాధునిక స్కానర్ల ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆ తర్వాత గుర్తింపు కార్డుల పరిశీలన, ఇమ్మిగ్రేషన్ విభాగం ఆంక్షలు, కస్టమ్స్ తనిఖీలు ఇలా పలు అంచెల భద్రతా వలయాలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ స్థాయి నిఘా ఏర్పాటు చేశారు.

5 / 5
Follow Us
టికెట్ ఉన్నా ఈ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టలేరు.. ఎందుకంటే?
టికెట్ ఉన్నా ఈ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టలేరు.. ఎందుకంటే?
జుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ రూ.199కే..వ్యాలిడిటీ ఎంతంటే
జుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ రూ.199కే..వ్యాలిడిటీ ఎంతంటే
మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు
మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు
అమ్మాయిలను రూమ్‌కి రప్పించి.. ఆ తర్వాత వేరే కథ
అమ్మాయిలను రూమ్‌కి రప్పించి.. ఆ తర్వాత వేరే కథ
తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..
తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..
బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..?
బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..?
కేతన్ కేస్ లో ప్రజాగ్రహం.. అమ్మాయి, ఆమె ప్రియుడిని శిక్షించాలంటూ
కేతన్ కేస్ లో ప్రజాగ్రహం.. అమ్మాయి, ఆమె ప్రియుడిని శిక్షించాలంటూ
ఇమ్యూనిటీని డబుల్ చేసే చింత తొక్కు చిత్రాన్నం.. పుల్లగా, కారంగా.
ఇమ్యూనిటీని డబుల్ చేసే చింత తొక్కు చిత్రాన్నం.. పుల్లగా, కారంగా.
డబ్బులిస్తే అయిపోతాయి కానీ.. వేణు మాధవ్ చేసిన సాయం చూస్తే..
డబ్బులిస్తే అయిపోతాయి కానీ.. వేణు మాధవ్ చేసిన సాయం చూస్తే..
ఈ కంపెనీ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు!
ఈ కంపెనీ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు!