‘వైకుంఠపురం’ రీమేక్‌లో యాక్షన్ హీరో..!

|

Apr 07, 2020 | 9:03 AM

Ala Vaikunthapurramuloo: అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన మూవీ ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను హిందీలో తెరకెక్కించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఈ రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అశ్విన్ వర్డే ఈ చిత్రం హక్కులను సుమారు 8 […]

వైకుంఠపురం రీమేక్‌లో యాక్షన్ హీరో..!
Follow us on

Ala Vaikunthapurramuloo: అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన మూవీ ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను హిందీలో తెరకెక్కించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఈ రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అశ్విన్ వర్డే ఈ చిత్రం హక్కులను సుమారు 8 కోట్లకు దక్కించుకున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత దీని స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాలని చూస్తున్నారట. అంతేకాకుండా ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది కూడా ఫైనల్ కావాల్సి ఉంది. ఏదైనా ఏప్రిల్ 14 తర్వాత ఈ రీమేక్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.

కాగా, అక్షయ్ ప్రస్తుతం ‘కాంచన’ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ‘లక్ష్మి బాంబ్’ పేరుతో విడుదల కానుంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. రాఘవ లారెన్స్ ఈ చిత్రానికి దర్శకుడు.

ఇది చదవండి: కలకలం రేపుతున్న కాకుల మరణాలు.. మిస్టరీ ఏంటంటే.?