విమానంలో బాంబు కలకలం.. అత్యవసర ల్యాండింగ్.. అదుపులోకి యువతి!
కోల్కతా నుంచి ముంబైకి వెళ్లే ఎయిర్ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎయిర్ఏషియా ఫ్లైట్ ఐ5316 లో ప్రయాణిస్తున్న మోహిని మొండల్ (25) క్యాబిన్ సిబ్బందిలో ఒకరికి నోట్ ఇచ్చి, దానిని ఫ్లైట్ కెప్టెన్కు అందజేయాలని కోరింది. ఆమె శరీరానికి బాంబులు ఉన్నాయని, ఏ క్షణమైనా ఆమె వాటిని పేల్చివేస్తున్నట్లు నోట్ లో పేర్కొంది. శనివారం రాత్రి 9:57 గంటలకు విమానం బయలుదేరింది. ఒక గంట తరువాత, విమానం బాంబు బెదిరింపు కారణంగా కోల్కతాకు తిరిగి […]
కోల్కతా నుంచి ముంబైకి వెళ్లే ఎయిర్ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఎయిర్ఏషియా ఫ్లైట్ ఐ5316 లో ప్రయాణిస్తున్న మోహిని మొండల్ (25) క్యాబిన్ సిబ్బందిలో ఒకరికి నోట్ ఇచ్చి, దానిని ఫ్లైట్ కెప్టెన్కు అందజేయాలని కోరింది. ఆమె శరీరానికి బాంబులు ఉన్నాయని, ఏ క్షణమైనా ఆమె వాటిని పేల్చివేస్తున్నట్లు నోట్ లో పేర్కొంది.
శనివారం రాత్రి 9:57 గంటలకు విమానం బయలుదేరింది. ఒక గంట తరువాత, విమానం బాంబు బెదిరింపు కారణంగా కోల్కతాకు తిరిగి వస్తున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు (ఎటిసి) సమాచారం ఇచ్చింది. రాత్రి 11 గంటలకు పూర్తి అత్యవసర పరిస్థితిని ఏటీసీ ప్రకటించింది. విమానం కోల్కతా విమానాశ్రయంలో దిగిన తరువాత, రాత్రి 11:46 గంటలకు ఐసోలేషన్ బేకు తీసుకువెళ్లారు.
ఆ యువతిని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) అదుపులోకి తీసుకుంది. విమానాన్ని క్షుణ్ణంగా శోధించామని అధికారులు తెలిపారు.
[svt-event date=”13/01/2020,1:13AM” class=”svt-cd-green” ]
Air Asia: Post landing, the aircraft was secured with the assistance of airport security staff and all the protocols were followed by the concerned agencies and the individual in question was detained. https://t.co/2Spp5hq2rB
— ANI (@ANI) January 12, 2020
[/svt-event]