ఒట్టేసి చెబుతున్నా.. నన్ను ఇబ్బంది పెట్టినోళ్లు బతికిలేరు.. నా జాతకమే అంత!

| Edited By:

Mar 08, 2020 | 9:48 AM

నా జాతకం ప్రకారం నన్ను ఇబ్బంది పెట్టినోళ్లు బతికి లేరని.. ఓట్టేసి చెబుతున్నా అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ప్రముఖ నటుడు, వైసీపీ నేత పృథ్వీ. గత కొద్ది రోజులుగా.. ఏపీలో హాట్‌టాపిక్‌గా..

ఒట్టేసి చెబుతున్నా.. నన్ను ఇబ్బంది పెట్టినోళ్లు బతికిలేరు.. నా జాతకమే అంత!
Follow us on

నా జాతకం ప్రకారం నన్ను ఇబ్బంది పెట్టినోళ్లు బతికి లేరని.. ఓట్టేసి చెబుతున్నా అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ప్రముఖ నటుడు, వైసీపీ నేత పృథ్వీ. గత కొద్ది రోజులుగా.. ఏపీలో హాట్‌టాపిక్‌గా నిలిచారు పృథ్వీ. ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న.. ఆడియో టేపుల వ్యవహారంలో.. దానికి రాజీనామా చేశారు. ఎస్వీబీసీలో పనిచేసే మహిళా ఉద్యోగితో పృథ్వీ రాసలీలలు సాగిస్తున్నారని.. ఓ ఆడియో కాల్ లీక్ అయ్యింది.

అయితే ఇందులో పృథ్వీ తన తప్పేమీ లేదని.. కావాలనే కుట్ర పూరితంగా తనని ఇరికించారని వాపోతున్నారు. అయినా నేను చేసింది తప్పని తేలితే చెప్పుతో కొట్టినా పడతా అంటూ బహిరంగంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ తీవ్ర కామెంట్స్ చేశారు. ఓ మహిళతో తాను రాసలీలలు సాగిస్తున్నానంటూ వైరల్ అవుతున్న ఆడియో టేప్ ఫేక్ అని.. ఇదంతా కుట్రని ఆరోపిస్తున్నారు పృథ్వీ. కాగా.. గత కొన్ని రోజులుగా ఆయన మీడియాకు దూరంగా ఉన్నారు. ఈ మధ్యనే మళ్లీ తిరుమలలో చేతికి కట్టుతో కనిపించారు. ఆడియో టేపు వ్యవహారంతో.. తన పరువు కూడా పోయిందని.. బోరున టీవీ ఇంటర్వ్యూలో బోరున విలపించారు.

ఇప్పటి వరకూ తాను ఏ ఛానెల్‌లోనూ కన్నీళ్లు పెట్టుకోలేదండీ.. అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఒట్టేసి చెబుతున్నా.. నన్ను ఇబ్బంది పెట్టినోళ్లు  ఎవ్వరూ బతికిలేు. ఆ వెంకటేశ్వర స్వామి సభ్యుల సాక్షిగా ఓట్టేసి చెబుతున్నా అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read More: ఇకపై లీటర్ పెట్రోల్ ఉంటేనే బండి నడుస్తుంది