బీహార్ లో పెరుగుతోన్న కరోనా కేసులు..రీజన్ ఇదే..
వేర్వేరు రాష్ట్రాల నుంచి బిహార్కు తిరిగి వచ్చిన 10వేల 385మంది వలస కూలీల్లో 560మంది కోవిడ్-19 సోకింది. మే 16 వరకు నమోదైన కరోనా వివరాలు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ 560మందిలో 172మంది ఢిల్లీ నుంచి వచ్చినట్టు పేర్కొంది. మరో 123 మంది మహారాష్ట్ర, 26మంది బెంగాల్ నుంచి బిహార్కు వచ్చినట్టు వివరించింది. మరో 2,746మంది టెస్టుల రిజల్ట్స్ ఇంకా రాలేదని పేర్కొంది. రాష్ట్రానికి వస్తోన్న వలస కూలీలను క్వారంటైన్ సెంటర్స్ కు తరలిస్తున్నట్టు […]

వేర్వేరు రాష్ట్రాల నుంచి బిహార్కు తిరిగి వచ్చిన 10వేల 385మంది వలస కూలీల్లో 560మంది కోవిడ్-19 సోకింది. మే 16 వరకు నమోదైన కరోనా వివరాలు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ 560మందిలో 172మంది ఢిల్లీ నుంచి వచ్చినట్టు పేర్కొంది. మరో 123 మంది మహారాష్ట్ర, 26మంది బెంగాల్ నుంచి బిహార్కు వచ్చినట్టు వివరించింది. మరో 2,746మంది టెస్టుల రిజల్ట్స్ ఇంకా రాలేదని పేర్కొంది. రాష్ట్రానికి వస్తోన్న వలస కూలీలను క్వారంటైన్ సెంటర్స్ కు తరలిస్తున్నట్టు బిహార్ ఆరోగ్యశాఖ తెలిపింది. నిత్యం అలర్ట్ గా ఉండి వైరస్ కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నట్టు తెలిపింది.
