గుజరాత్‌లో కరోనా విజృంభణ.. ఇవాళ ఒక్కరోజే 470 పాజిటివ్ కేసులు..

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. గుజరాత్‌లో ఇవాళ ఒక్కరోజే మరో 470 మందికి కొవిడ్-19 సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య

గుజరాత్‌లో కరోనా విజృంభణ.. ఇవాళ ఒక్కరోజే 470 పాజిటివ్ కేసులు..
Follow us

| Edited By:

Updated on: Jun 09, 2020 | 10:08 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. గుజరాత్‌లో ఇవాళ ఒక్కరోజే మరో 470 మందికి కొవిడ్-19 సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,044కు చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో మరో 33 మంది చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 1,313కి చేరింది. కొత్తగా 409 మంది డిశ్చార్జి కావడంతో ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,373 చేరింది. ప్రస్తుతం 5,358 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 64 మందికి వెంటలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Also Read: కరోనా వైరస్ లక్షణాలు లేనివారితో.. సంక్రమణం అరుదు..: ప్రపంచ ఆరోగ్య సంస్థ