AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజాబ్‌లో దారుణం.. కల్తీ కల్లు తాగి 21 మంది దుర్మరణం!

పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. పలు జిల్లాల్లో కల్తీ కల్లు తాగి 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై

పంజాబ్‌లో దారుణం.. కల్తీ కల్లు తాగి 21 మంది దుర్మరణం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 31, 2020 | 6:34 PM

Share

పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. పలు జిల్లాల్లో కల్తీ కల్లు తాగి 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికి కారకులైన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘‘అమృత్‌సర్, గురుదాస్‌పూర్, తారన్ తరన్ ప్రాంతాల్లో కల్తీ కల్లు మరణాలపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించాం. జలంధర్ డివిజన్‌కు చెందిన ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరుపుతారు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షింస్తామని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని సీఎం అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.

[svt-event date=”31/07/2020,5:47PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Read More:

నర్సులకు భారీ ఆఫర్లు.. విమానచార్జీలు.. 50 వేల జీతం..!

ఇంటర్ సెకండియర్‌ విద్యార్థులందరూ పాస్‌.. అందుబాటులో మెమోలు..!