ఉద్యోగం పోయింది.. లక్షీదేవి వరించింది..!
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో చాలామంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. మొన్నటి వరకు ఇలాంటి జీవితాన్నే అనుభవించిన
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో చాలామంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. మొన్నటి వరకు ఇలాంటి జీవితాన్నే అనుభవించిన ఓ సెక్యూరిటీ గార్డు ఇటీవలే కోటీశ్వరుడు అయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన సెక్యూరిటీ గార్డు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయాడు. ఆ ఉద్యోగం పోవడంతో అతనికి పట్టిన శని కూడా వదిలినట్లుంది. ఎందుకంటే అతడిని లక్షీదేవి వరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 కోట్లు లాటరీ తగిలింది.
ఆస్ట్రేలియాలో పెర్త్ నగరంలోని అర్మడేల్ లో నివసిస్తున్న ఆ వ్యక్తి కొన్నాళ్లు కిందట తన మూడేళ్ల కుమార్తెతో కలిసి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి వెళ్లాడు. అక్కడ తన లక్ను పరీక్షించదలచి కనిపిస్తున్న ‘ఓజ్ లొట్టో’ లాటరీ టికెట్ను కొనుగోలు చేశాడు. కొన్నిరోజుల తర్వాత లాటరీ సంస్థ విజేతను ప్రకటించింది. విజేత తనే అని తెలుసుకోవడంతో ఆ వ్యక్తి ఆనందానికి హద్దుల్లేవు. దీంతో లాటరీ అధికారులు ఈ డబ్బును ఏం చేస్తావని ప్రశ్నించగా ముందుగా నా కూతురిని గట్టిగా హగ్ చేసుకొని తర్వాత అమ్మకు కారు, తమ్ముడికి ఆర్థిక సాయం, అలానే ఇళ్లు కట్టుకొని, పిల్లలను మంచి స్కూల్లో చేర్పిస్తానని తెలిపాడు.
Read More:
నర్సులకు భారీ ఆఫర్లు.. విమానచార్జీలు.. 50 వేల జీతం..!
ఇంటర్ సెకండియర్ విద్యార్థులందరూ పాస్.. అందుబాటులో మెమోలు..!