AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాసిక్ లో ఘోరప్రమాదం.. బస్సు బావిలో పడి 20 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. మాలెగావ్​ నుంచి ధోబీఘాట్​కు వెళ్తున్న ఓ బస్సు, ఆటో ఒకదానికొకటి ఢీకొని బావిలో పడ్డాయి. మహారాష్ట్ర నాసిక్‌లోని దియోలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు బావిలో పడిన ఘటనలో 20 మంది చనిపోయారు. మరో 30 మందిని అధికారులు రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని నాసిక్ ఎస్పీ ఆర్తి […]

నాసిక్ లో ఘోరప్రమాదం.. బస్సు బావిలో పడి 20 మంది మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 28, 2020 | 10:41 PM

Share

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. మాలెగావ్​ నుంచి ధోబీఘాట్​కు వెళ్తున్న ఓ బస్సు, ఆటో ఒకదానికొకటి ఢీకొని బావిలో పడ్డాయి. మహారాష్ట్ర నాసిక్‌లోని దియోలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు బావిలో పడిన ఘటనలో 20 మంది చనిపోయారు. మరో 30 మందిని అధికారులు రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని నాసిక్ ఎస్పీ ఆర్తి సింగ్ తెలిపారు. ఎదురుగా వస్తున్న ఆటో రిక్షాను ఢీకొనకుండా తప్పించేందుకు బస్సు డ్రైవర్ యత్నించాడు. ఈ క్రమంలో బస్సు, ఆటోరిక్షా బావిలో పడ్డాయి.