AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆనంద్ మహీంద్రాకు బాధ కలిగించిన వైరల్ వీడియో.. పద్ధతి మార్చుకోవాలంటూ..

ఈ వీడియోను ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో చిత్రీకరించారు. ఇందులో కొందరు ట్యాక్సీలో వచ్చి రోడ్డుపక్కన ఆపి పెద్ద పెద్ద సంచుల్లో నింపిన పూల వ్యర్థాలను సముద్రపు నీటిలో పడేశారు. ఒకదాని తర్వాత ఒకటి రెండు, మూడు పువ్వుల వ్యర్థాలను నీటిలో పడేశారు. పక్కనే నిలబడిన ఎవరో వీటన్నింటిని వీడియో తీయడంతో అది వైరల్‌గా మారింది.

Watch Video: ఆనంద్ మహీంద్రాకు బాధ కలిగించిన వైరల్ వీడియో.. పద్ధతి మార్చుకోవాలంటూ..
Anand Mahindra
Janardhan Veluru
|

Updated on: Nov 22, 2023 | 7:01 PM

Share

యావత్ ప్రపంచం ప్రస్తుతం పలు రకాల కాలుష్యంతో పోరాడుతోంది. పరిశ్రమల వ్యర్థాలు, ప్రజల అజాగ్రత్త, ఉద్దేశపూర్వకంగా పర్యావరణానికి వ్యతిరేకంగా చేస్తున్న చర్యల వల్ల పర్యావరణంతో చెలగాటమాడుతున్న అనేక ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొంతకాలంగా కాలుష్య సమస్య తీవ్రతరం అవుతోంది. ప్రభుత్వాలు ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని చాలా మంది ప్రజలు మానుకోవడం లేదు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఈ వీడియోను ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో చిత్రీకరించారు. ఇందులో కొందరు ట్యాక్సీలో వచ్చి రోడ్డుపక్కన ఆపి పెద్ద పెద్ద సంచుల్లో నింపిన పూల వ్యర్థాలను సముద్రపు నీటిలో పడేశారు. ఒకదాని తర్వాత ఒకటి రెండు, మూడు పువ్వుల వ్యర్థాలను నీటిలో పడేశారు. పక్కనే నిలబడిన ఎవరో వీటన్నింటిని వీడియో తీయడంతో అది వైరల్‌గా మారింది. సముద్రపు నీటిని వారు కలుషితం చేస్తున్న తీరు అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది.

ఈ వీడియోను ఫోటోగ్రాఫర్ ఉజ్జల్ పూరి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను కూడా ట్యాగ్ చేశాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో తనను చాలా బాధపెడుతోందని వ్యాఖ్యానించారు. పౌరులు తమ వైఖరిని మార్చుకోకపోతే, భౌతిక మౌలిక సదుపాయాలను ఎంత మెరుగుపరిచినా నగర జీవితాన్ని మెరుగుపరచలేమని పేర్కొన్నారు. ముంబై పోలీసులతో పాటు గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్‌ను కూడా ఆనంద్ మహీంద్రా ఈ పోస్ట్‌ని ట్యాగ్ చేసింది.

ఆనంద్ మహీంద్రా ట్వీట్..

దీంతో రంగంలోకి దిగిన బీఎంసీ అధికారులు.. గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద వ్యర్థాలను సముద్రంలో పడేస్తున్న ఆ వ్యక్తులను గుర్తించారు. వారికి రూ.10వేల జరిమానా విధించారు.

Follow Us
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు