AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆనంద్ మహీంద్రాకు బాధ కలిగించిన వైరల్ వీడియో.. పద్ధతి మార్చుకోవాలంటూ..

ఈ వీడియోను ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో చిత్రీకరించారు. ఇందులో కొందరు ట్యాక్సీలో వచ్చి రోడ్డుపక్కన ఆపి పెద్ద పెద్ద సంచుల్లో నింపిన పూల వ్యర్థాలను సముద్రపు నీటిలో పడేశారు. ఒకదాని తర్వాత ఒకటి రెండు, మూడు పువ్వుల వ్యర్థాలను నీటిలో పడేశారు. పక్కనే నిలబడిన ఎవరో వీటన్నింటిని వీడియో తీయడంతో అది వైరల్‌గా మారింది.

Watch Video: ఆనంద్ మహీంద్రాకు బాధ కలిగించిన వైరల్ వీడియో.. పద్ధతి మార్చుకోవాలంటూ..
Anand Mahindra
Janardhan Veluru
|

Updated on: Nov 22, 2023 | 7:01 PM

Share

యావత్ ప్రపంచం ప్రస్తుతం పలు రకాల కాలుష్యంతో పోరాడుతోంది. పరిశ్రమల వ్యర్థాలు, ప్రజల అజాగ్రత్త, ఉద్దేశపూర్వకంగా పర్యావరణానికి వ్యతిరేకంగా చేస్తున్న చర్యల వల్ల పర్యావరణంతో చెలగాటమాడుతున్న అనేక ఉదంతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొంతకాలంగా కాలుష్య సమస్య తీవ్రతరం అవుతోంది. ప్రభుత్వాలు ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని చాలా మంది ప్రజలు మానుకోవడం లేదు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఈ వీడియోను ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో చిత్రీకరించారు. ఇందులో కొందరు ట్యాక్సీలో వచ్చి రోడ్డుపక్కన ఆపి పెద్ద పెద్ద సంచుల్లో నింపిన పూల వ్యర్థాలను సముద్రపు నీటిలో పడేశారు. ఒకదాని తర్వాత ఒకటి రెండు, మూడు పువ్వుల వ్యర్థాలను నీటిలో పడేశారు. పక్కనే నిలబడిన ఎవరో వీటన్నింటిని వీడియో తీయడంతో అది వైరల్‌గా మారింది. సముద్రపు నీటిని వారు కలుషితం చేస్తున్న తీరు అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది.

ఈ వీడియోను ఫోటోగ్రాఫర్ ఉజ్జల్ పూరి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను కూడా ట్యాగ్ చేశాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో తనను చాలా బాధపెడుతోందని వ్యాఖ్యానించారు. పౌరులు తమ వైఖరిని మార్చుకోకపోతే, భౌతిక మౌలిక సదుపాయాలను ఎంత మెరుగుపరిచినా నగర జీవితాన్ని మెరుగుపరచలేమని పేర్కొన్నారు. ముంబై పోలీసులతో పాటు గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్‌ను కూడా ఆనంద్ మహీంద్రా ఈ పోస్ట్‌ని ట్యాగ్ చేసింది.

ఆనంద్ మహీంద్రా ట్వీట్..

దీంతో రంగంలోకి దిగిన బీఎంసీ అధికారులు.. గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద వ్యర్థాలను సముద్రంలో పడేస్తున్న ఆ వ్యక్తులను గుర్తించారు. వారికి రూ.10వేల జరిమానా విధించారు.

Follow Us
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..