AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఒక్క మెసేజ్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరులైన గ్రామస్తులు.. అసలేం జరిగిందంటే..

అబ్రకదబ్ర.. దబ్రకఅబ్ర.. అప్పటిదాకా సాధారణ జీవితం గడుపుతున్న ఆ గ్రామస్తుల జీవితాల్లోకి వెలుగు వచ్చింది.

Viral: ఒక్క మెసేజ్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరులైన గ్రామస్తులు.. అసలేం జరిగిందంటే..
Money
Ravi Kiran
|

Updated on: Dec 12, 2022 | 1:44 PM

Share

అబ్రకదబ్ర.. దబ్రకఅబ్ర.. అప్పటిదాకా సాధారణ జీవితం గడుపుతున్న ఆ గ్రామస్తుల జీవితాల్లోకి వెలుగు వచ్చింది. ఆ రాత్రి వచ్చిన ఒక్క మెసేజ్ వారిని ఏకంగా కోటీశ్వరులు చేసింది. దాదాపు 165 మంది గ్రామస్తుల ఖాతాల్లోకి రూ. 7.50 కోట్ల చొప్పున నగదు జమ అయింది. ఏంటీ ఏదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా.? ఇంతకీ అసలేం జరిగిందంటే..

బెల్జియంలోని బాలెన్ మున్సిపాలిటీకి చెందిన ఓ గ్రామం పేరు అల్మెన్. ఈ గ్రామంలో నివసిస్తున్న వారి సంఖ్య 3100. వీరిలో దాదాపు 165 మందికి జాక్‌పాట్ తగిలింది. ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ. 7.50 కోట్లు జమ అయ్యాయి. అదీ ఎందుకంటారా.? వీరందరూ కూడా కలిసి ఇటీవల యూరోమిలియన్ లాటరీ టికెట్స్‌ను కొనుగోలు చేశారు. ఆ లాటరీ నిర్వాహకులు కొద్దిరోజుల కిందట డ్రా తీయగా.. దానిలో 165 మందికి లాటరీ తగిలింది. వీళ్లు ఏకంగా రూ. 1200 కోట్లు గెలుచుకున్నారు. అందులో భాగంగానే ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ. 7.50 కోట్లు జమ అయ్యాయి. దీంతో సదరు వ్యక్తులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. గత కొన్నేళ్ళుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నామని.. ఇప్పటికీ తమకు అదృష్టం వరించిందని.. దీన్ని క్రిస్మస్ గిఫ్ట్‌గా భావిస్తామని చెప్పుకొచ్చారు.(Source)