
భారతదేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే, ప్రయాణికులలో అత్యంత ప్రజాదరణ పొందిన రైలు ఒకటి ఉందని మీరు నమ్మగలరా? అవును, ఈ రైలు తమిళనాడులో నడుస్తుంది. మొత్తం 46 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి దీనికి 5 గంటల సమయం పడుతుంది. ఈ రైలు గురించి ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఈ రైలు గంటకు కేవలం 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మొత్తం 46 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల్లో పూర్తి చేస్తుంది. పదునైన వంపులు, నిటారుగా ఉన్న పర్వత సానువుల కారణంగా ఈ రైలు చాలా నెమ్మదిగా ప్రయాణిస్తుంది.
నీలగిరిని సందర్శించే చాలా మంది పర్యాటకుల మనస్సులలో ఈ పర్వత రైలు ఎప్పుడూ నిలిచిపోతుంది. చాలా మందిని ఆకర్షించే ఈ రైలు నీలగిరి అందాలను అనుభవించాలనుకునే వారికి కలల వాహనం అనవచ్చు. భారతదేశంలోని అత్యంత వేగవంతమైన రైలుతో పోలిస్తే, ఈ రైలు 20 రెట్లు నెమ్మదిగా ప్రయాణిస్తుంది.
ప్రయాణంలో పర్వతాలు, అడవులు, జలపాతాల గుండా వెళుతూ 208 వక్రతలు (Curves), 16 సొరంగాలు (Tunnels), 250 కంటే ఎక్కువ వంతెనలను దాటుతుంది.
పురాతన ఆవిరి ఇంజిన్లతో నడిచే ఈ రైలును 2005 లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.