SBI: ఖాతాదారుల కోసం మరో వెసులుబాటు కల్పించిన బ్యాంకింగ్ దిగ్గజం.. ఇకపై ఆ పనికోసం బ్యాంక్ వెళ్లాల్సిన అవసరం లేదు..

Make SBI Nominee Registration Online: మారుతోన్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్నాయి బ్యాంకింగ్ సంస్థలు. ఇందులో ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం ఎస్‌బీఐ ముందు వరుసలో ఉంటుంది...

SBI: ఖాతాదారుల కోసం మరో వెసులుబాటు కల్పించిన బ్యాంకింగ్ దిగ్గజం.. ఇకపై ఆ పనికోసం బ్యాంక్ వెళ్లాల్సిన అవసరం లేదు..
Follow us

|

Updated on: Feb 05, 2021 | 11:46 PM

Make SBI Nominee Registration Online: మారుతోన్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్నాయి బ్యాంకింగ్ సంస్థలు. ఇందులో ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం ఎస్‌బీఐ ముందు వరుసలో ఉంటుంది. ఖాతాదారుల సౌకర్యానికి పెద్ద పీఠ వేస్తూ వినూత్న సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలో మరో కొత్త అవకాశాన్ని కల్పించింది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. సాధారణంగా బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతీ వ్యక్తి.. తమ నామినీని పేర్కొనాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్‌ కోసం కచ్చితంగా బ్యాంకుకు వెళ్లాలి. అయితే ఇకపై ఆ పనిలేకుండా ఇంట్లో నుంచి ఆన్‌లైన్‌ ద్వారా సింపుల్‌గా ఈ పనిచేసేయొచ్చని చెబుతోంది ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా ఖాతా దారులతో పంచుకుంది. ఇకపై ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్‌ లేదా ఎస్‌బీఐ మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఈ ఆప్షన్‌ ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. అంతేకాకుండా యోనో యాప్‌ ద్వారా కూడా అకౌంట్‌కు నామినీ వివరాలను జత చేసుకోవచ్చు. ఖాతాదారుడు అనుకోకుండా మరణిస్తే.. అప్పుడు ఆ బ్యాంక్‌ ఖాతాలో ఉన్న డబ్బులపై నామినీ పూర్తి అధికారం ఉండేందుకు గాను ఈ ఆప్షన్‌ను తీసుకొచ్చారు.

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఇలా చేసుకోవాలి..

* మొదట onlinesbi.com ఓపెన్‌ చేసి లాగిన్‌ వివరాలతో లాగిన్‌ కావాలి.

* అనంతరం మెనులోని ‘రిక్వెస్ట్ & ఎంక్వైరీస్’ టాబ్ పై క్లిక్ చేయాలి.

* తర్వాత ఆన్‌లైన్‌ నామినేషన్‌ ఆప్షన్‌ను ఎంచుకొని.. నామినీని యాడ్ చేయాలనుకుంటున్న ఖాతాను ఎంచుకొని ప్రొసిడ్‌పై క్లిక్‌ చేయాలి.

* అనంతరం నామినీ పూర్తి విరవాలను నమోదు చేసి ‘సబ్మిట్‌’ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

* వెంటనే మీ మొబైల్‌కు వచ్చిన పాస్ట్‌వర్డ్‌ను ఎంటార్ చేసి. ‘కన్ఫామ్‌’ బటన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోద్ది.

Also Read: Computer Keyboard: కీ బోర్డుపై అక్షరాలు వరుస క్రమంలో ఎందుకు ఉండవు..?.. అలా ఎందుకు తయారు చేశారు..?

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు