AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: మరింత సువిశాలంగా అయోధ్యలో భవ్య రామమందిరం.. పూర్తి వివరాలు..

Ayodhya Ram Mandir: అయోధ్యలో సువిశాలంగా రామ మందిరం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆలయం సముదాయాన్ని 70 ఎకరాల నుంచి 107 ఎకరాలకు విస్తరించడానికి నిర్ణయం తీసుకుంది.

Ayodhya Ram Mandir: మరింత సువిశాలంగా అయోధ్యలో భవ్య రామమందిరం.. పూర్తి వివరాలు..
Ayodhya Ram Mandir
uppula Raju
|

Updated on: Mar 20, 2021 | 5:08 PM

Share

Ayodhya Ram Mandir: అయోధ్యలో సువిశాలంగా రామ మందిరం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆలయం సముదాయాన్ని 70 ఎకరాల నుంచి 107 ఎకరాలకు విస్తరించడానికి నిర్ణయం తీసుకుంది. అందుకోసం రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భూమి కొనుగోలు చేస్తోంది. యాత్రికులకు సౌకర్యాలు, భద్రతా దళాలకు వసతి, ఇతర కార్యకలాపాలను అభివృద్ధి చేయడానికి ట్రస్ట్ 1.15 లక్షల చదరపు అడుగుల కొలత గల మరో రెండు ప్లాట్లను రూ .8 కోట్లకు కొనుగోలు చేసింది.

ట్రస్ట్ ఈ రెండు ప్లాట్లను బస్తీ జిల్లాలో నివసిస్తున్న హరీష్ కుమార్ పాథక్ నుంచి చదరపు అడుగుకు 690 రూపాయల మార్కెట్ రేటుకు కొనుగోలు చేసింది. ఈ ప్లాట్లు తెహ్రీ బజార్, రామ్ కోట్ ప్రాంతాలలో ఉన్న ఆలయ స్థలం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ రెండు ప్లాట్లు కొనడానికి చర్చలు కొంతకాలం నుంచి భూమి యజమానితో చర్చలు కొనసాగుతున్నాయి. చివరకు యజమాని ట్రస్ట్ అందించే ధరకు విక్రయించడానికి అంగీకరించాడు. ఇంతకు ముందు, ట్రస్ట్ రామ్ కోట్ ప్రాంతంలో 7285 చదరపు అడుగుల స్థలాన్ని కోటి రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఆలయ ప్రాంగణ వ్యాప్తికి ఆనుకొని ఉన్న ముస్లింల ఇళ్లు, ఆస్తులు, యజమానుల పేర్లను ట్రస్ట్ ఇప్పటికే జాబితా చేసిందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. ఆలయ సముదాయం విస్తరణ కోసం ట్రస్ట్‌కు విక్రయించడానికి అనుమతి కోరేందుకు ట్రస్ట్ సభ్యులు వారితో చర్చలు జరుపుతున్నారు. పరస్పర అవగాహన మరియు ఒప్పందంపై మాత్రమే భూములను కొనుగోలు చేస్తోంది. ఇందులో బలవంతం లేదని స్పష్టం చేసింది. ఆలయ సముదాయం విస్తరణ కోసం వారి ఆస్తులను విక్రయించడానికి అంగీకరించిన తరువాత మేము వారి ఆస్తుల మార్కెట్ రేటు లేదా వేరే స్థలంలో సమానమైన భూమిని అందిస్తున్నామని అని రాయ్ వెల్లడించారు.

శ్రీలంకలోని ఎలియా గ్రామంలోని సీత దేవత ఆలయం నుంచి 20 కిలోల నల్ల రాయి రాక కోసం ట్రస్ట్ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎలియ గ్రామంలోని సీతా మాతా ఆలయం రావణుడు ఆమెను అపహరించిన తరువాత బందీగా ఉంచిన ప్రదేశంలోనే ఉందని నమ్ముతారు. ఈ రాయిని త్వరలోనే శ్రీలంక హైకమిషనర్ భారతదేశానికి మిలిండా మొరగోడకు అప్పగించే అవకాశం ఉంది. ఆలయ నిర్మాణంలో విలువైన నల్ల రాయి ఉపయోగిస్తున్నారు.

Telangana MLC Election Results 2021 LIVE: ఉత్కంఠగా కొనసాగుతున్న తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

రేప్ చేయబోయిన వ్యక్తి… మరెప్పుడు అలాంటి పని చేయకుండా తగిన శాస్తి చేసిన మహిళ