AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neelakurinji Flower: పన్నెండు ఏళ్లకు ఒక్కసారి పూసే పువ్వు .. దీని ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా?

మనకు పన్నిండేళ్లకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయని తెలుసు. కానీ 12 సంవత్సరాలకు ఒక్కసారే ఆ చెట్టుకు పువ్వులు పూస్తాయి. అందులోను ఈపువ్వులు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మాత్రమే కనిపిస్తాయి. ఇలా విరబూసిన పూలతోటి ఆ ప్రాంతం ఒక సుందర సౌందర్య చిత్రాన్ని ప్రకృతిలో ఆవిష్కరిస్తుంది. అయితే ఈ పూలు పూసే చెట్లు అంతరించి పోతున్నాయనే ఆందోళన నేపథ్యంలో ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంతకీ అసలు ఆ పువ్వు ఏది.. ఏ ప్రాంతంలో కనిపిస్తుంది. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తం చదివేయండి.

Neelakurinji Flower: పన్నెండు ఏళ్లకు ఒక్కసారి పూసే పువ్వు .. దీని ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా?
Neelakurinji Flower
B Ravi Kumar
| Edited By: |

Updated on: Feb 05, 2026 | 7:25 PM

Share

పశ్చిమకనుమల్లో ప్రతి పన్నెడు ఏళ్లకు ఒక్కసారి పూసే పువ్వులు “నీల కురింజి”. దక్షిణ భారతదేశంలో కేరళ , తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల పశ్చిమకనుమల్లో ఇవి అరుదుగా పూస్తుంటాయి. ఇవి విరబూసినపుడు ఆ పర్వతాలు సముద్రంలా నీలిరంగులోకి మారిపోతాయి. వాటిని చూస్తూ పర్యాటకులు మంత్ర ముగ్దులు అవుతారు. టొడా గిరిజన తెగకు ఈ పువ్వులు పవిత్రమైనవి. పునర్జన్మ , వయస్సు , ఋతువులు లకు ఇవి ప్రామాణికమైనవని ఆ జాతి సంప్రదాయం. 2018లో చివరిగా ఈ పువ్వులు కనిపించాయి మళ్ళీ వీటిని చూడాలంటే 2030 వరకు ఆగాల్సిఉంటుంది.

తమిళంలో కురుంజి , మలయాళం లో నీలకురుంజి, కన్నడలో గురిగే అని ఈ చెట్లను స్థానికులు పిలుస్తారు. ఇక నీల కురుంజి మొక్కలు వల్లే నీలగిరి పర్వతాలకు ఆపేరు వచ్చిందని చెబుతారు. సముద్రమట్టానికి 1300 నుంచి 2600 ల మీటర్ల ఎత్తులో పొదల్లా ఇవి పెరుగుతాయి. 30 నుండి 60 సెంటీమీటర్ల ఎత్తు పెరిగి ఊదా , నీలిరంగు పువ్వులు పూస్తాయి. తమిళనాడులో ఈ పువ్వులు పుష్పించే కాలానికి అనుగుణంగా తమ వయస్సును పాలియన్ గిరిజన తెగ లెక్కిస్తుందని అక్కడి వారు చెబుతారు. అయితే పశ్చిమ కనుమల్లో పెరుగుతున్న టీ , కాఫీ తోటలు , పర్యాటక రంగం విస్తరణ తో నీలకురుంజి అంతరించి పోయే ప్రమాదం ఏర్పడింది .

ఈ క్రమంలో బొటానికల్ సెర్వే ఆఫ్ ఇండియా – బి ఎస్ ఐ , ఈ మొక్కకు ఎదురవుతున్న ప్రమాదాలను అంచనా వేయటానికి ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ లో వున్న ముగ్గురు సభ్యులు బాబాబుదాన్ గిరి , కుడ్రేముఖ్ , అన్నామలై , ఎరవికులం , నీలగిరి , పలని పరిసర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఈ మొక్కలకు ఎదురవుతున్న సవాళ్ళ పై పరిశోధనలు జరపబోతున్నారు.

పర్యావరణ , అడవులు – వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ , బి ఎస్ ఐ లు ఈ మొక్కను ప్రత్యేక పర్యావరణ , సింబాలిక్ ప్రాధాన్యత ఉన్నట్లు గుర్తింపు ఇస్తున్నట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు తెలిపింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కాన్సెర్వేషన్ ఆఫ్ నేచర్ జాబితాలో చేరటంతో ఈ మొక్కకు 2024 తరువాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.