AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉప్పు ఎక్కువగా తింటే మీ ప్రాణానికే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?

ఉప్పు మన రోజువారీ ఆహారంలో తప్పనిసరి. కానీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇది బీపీ పెరిగేలా చేస్తుంది. గుండె, కిడ్నీ, మెదడు, ఎముకలు వంటి ముఖ్యమైన అవయవాలపై దుష్ప్రభావం చూపుతుంది. కాబట్టి రోజుకు అవసరమైనంత మాత్రమే ఉప్పు తీసుకోవాలి.

ఉప్పు ఎక్కువగా తింటే మీ ప్రాణానికే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
Salt
Prashanthi V
|

Updated on: May 01, 2025 | 4:25 PM

Share

ప్రతిరోజూ తినే ఆహారంలో ఉప్పు అవసరం. కానీ దాన్ని అధికంగా తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుంది. కొంతమంది పదార్థాల రుచి కోసం ఎక్కువ ఉప్పు వాడతారు. ఇది ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతుంది. ఉప్పు ఎక్కువ తినడం వల్ల బీపీ పెరుగుతుంది అనే విషయం చాలా మందికి తెలుసు. ఇది ప్రారంభ సమస్య మాత్రమే.. దీని వల్ల గుండెకు బాగా ఒత్తిడి పెరుగుతుంది. శరీరంలో రక్తప్రసరణ క్రమం తప్పుతుంది.

బీపీ పెరిగినప్పుడు గుండెపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీని వల్ల గుండె నెమ్మదిగా బలహీనపడుతుంది. కొంతమందికి గుండె జబ్బులు రావచ్చు. గుండె పేస్ సరిగా పనిచేయకపోవచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే దీని వల్ల స్ట్రోక్ ప్రమాదం కూడా ఉంటుంది.

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే కిడ్నీలపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే కిడ్నీలు ఫిల్టర్ చేసే పని ఎక్కువ అవుతుంది. దీని వల్ల కిడ్నీ వేగంగా అలసిపోతుంది. చివరికి కిడ్నీ పనితీరు తగ్గిపోతుంది. దీని ప్రభావం తీవ్రమవుతుంది.

శరీరంలో ఉప్పు స్థాయి అదుపులో లేకపోతే మెదడుపై ప్రభావం పడుతుంది. మెదడు క్రమంగా మందగిస్తుంది. ఆలోచన శక్తి తగ్గిపోతుంది. నిద్రలేమి సమస్య వస్తుంది. అలసట కూడా అధికమవుతుంది.

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. శరీరంలో కాల్షియం తక్కువవుతుంది. దీని కారణంగా బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఎముకలు సులభంగా విరిగే ప్రమాదం కూడా ఉంటుంది.

శరీరంలో ఉప్పు మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది. ఆహారం పేగులలో సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు. ఇది గ్యాస్ సమస్యకు దారి తీస్తుంది.

ఉప్పు శరీరంలో నీటిని నిలుపుతుంది. దీంతో చేతులు, కాళ్లు, ముఖం వాపుతో బాధపడతాయి. ఇది రోజురోజుకూ పెరిగితే సౌకర్యంగా ఉండదు. పని చేయడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది.

ఇప్పటికే నీరు తక్కువ తాగే వాళ్లకు ఉప్పు ఎక్కువ తినడం వల్ల శరీరం ఇంకాస్త నీటిని కోల్పోతుంది. ఈ పరిస్థితిని డీహైడ్రేషన్ అంటారు. దీనివల్ల నోటిలో పొడిబారడం, చర్మం పొడిబారడం మొదలవుతాయి. దీనికి తగిన నీరు తీసుకోవడం తప్పనిసరి.

ఉప్పు తీసుకోవడాన్ని నియంత్రించాలి. రోజుకు అవసరమైనంత మాత్రమే వాడాలి. బయట దొరికే అధిక ఉప్పు ఉన్న స్నాక్స్, ప్యాకెట్ల ఫుడ్ తగ్గించాలి. ఇంట్లో తాజా పదార్థాలతో తక్కువ ఉప్పుతో వండిన ఆహారం తీసుకోవాలి. బీపీ ఉన్నవాళ్లు ఉప్పు పూర్తిగా తగ్గించాలి. ఈ చిన్న అలవాట్లు జీవితంలో పెద్ద మార్పులు తీసుకురాగలవు.