AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: మధుమేహం ఉన్నవారు ఇలా అన్నం వండుకు తింటే బెటర్‌..! షుగర్‌ లెవల్స్‌ పెరగవు

డయాబెటిస్ చికిత్స చేయలేని వ్యాధి. కానీ కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. స్టార్చ్ లేని అన్నం తినేటప్పుడు మీరు ఫిట్‌గా , ఆరోగ్యంగా ఎలా ఉండవచ్చో, షుగర్ లెవల్స్ పెరగకుండా ఎలా మెయింటైన్ చేయొచ్చు...

Diabetes: మధుమేహం ఉన్నవారు ఇలా అన్నం వండుకు తింటే బెటర్‌..! షుగర్‌ లెవల్స్‌ పెరగవు
Diabetes
Jyothi Gadda
|

Updated on: Jun 24, 2022 | 6:23 PM

Share

Diabetes: ఈ రోజుల్లో మధుమేహం సర్వసాధారణమైపోయింది. భారతదేశంలో అత్యంత ప్రబలంగా ఉన్న ఆరోగ్య పరిస్థితులలో మధుమేహం ఒకటి. మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజూ ఎంత ప్రోటీన్, మినరల్, కొవ్వు, కార్బోహైడ్రేట్ తీసుకోవచ్చో తెలుసుకోవాలి. డయాబెటిస్ చికిత్స చేయలేని వ్యాధి. కానీ కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. స్టార్చ్ లేని అన్నం తినేటప్పుడు మీరు ఫిట్‌గా , ఆరోగ్యంగా ఎలా ఉండవచ్చో, షుగర్ లెవల్స్ పెరగకుండా ఎలా మెయింటైన్ చేయొచ్చు..మధుమేహం వచ్చిన వాళ్లు కొన్ని చిట్కాలని పాటించాలి. అప్పుడు రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

చాలా మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్నం తినడానికే ఎక్కువ ఇష్టపడుతుంటారు. కానీ అన్నం తినడం వల్ల వారికి చాలా హాని కలుగుతుంది. ఇది మీ శరీర బరువును పెంచుతుంది. దీనికి కారణం అన్నం సరిగ్గా ఉడికించకపోవడమే అంటున్నారు నిపుణులు. దీని కారణంగా అన్నంలో పోషణ తొలగించబడుతుంది, అయితే దాని హానికరమైన మూలకం ఆర్సెనిక్ శరీరంలోకి వెళుతుంది. అందువల్ల, బియ్యం సరిగ్గా ఉడికించడం చాలా ముఖ్యం. కాబట్టి అన్నం వండడానికి సరైన మార్గాన్ని వివరించారు యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ శాస్త్రవేత్తలు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శాస్త్రవేత్తలు ఈ బియ్యాన్ని వండే పద్ధతికి PBA అని పేరు పెట్టారు. అంటే శోషణ పద్ధతితో పార్బాయిలింగ్, దీనిని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ కనుగొన్నారు. సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్‌లో ప్రచురించబడిన పరిశోధనలో ఈ PBA పద్ధతి వివరించబడింది. పార్బాయిలింగ్ అంటే వెచ్చని నీళ్ళతోనూ ఆవిరితోనూ వరిబియ్యాన్ని సగం ఉడకబెట్టి, దాని నాణ్యతను మెరుగుపరచే ఒక పద్ధతిని పార్బాయిలింగ్ అంటారు. ఈ పద్ధతి ప్రకారం, ముందుగా బియ్యం బాగా కడిగిపెట్టాలి, అందులో అన్నం సిద్ధం చేయడానికి ముందు 5 నిమిషాలు ముందు కడిగిపెట్టాలి. ఇది ఆర్సెనిక్‌ను తొలగిస్తుంది. దీని తరువాత, బియ్యంలో నీరు పోసి తక్కువ మంటపై ఉడికించాలి. బియ్యం బాగా ఉడికిన తర్వాత గజ్జిని పూర్తిగా వంపి, మరికొద్దిసేపు స్టౌ మీద ఆవిరిపై పెట్టి, నీటిని బాగా పీల్చుకున్నప్పుడు, గ్యాస్ ఆఫ్ చేయాలి. పరిశోధన ప్రకారం, ఈ విధంగా బియ్యం వండినట్లయితే, బ్రౌన్ రైస్ నుండి 50 శాతం వరకు ఆర్సెనిక్ తొలగించబడుతుంది, అయితే వైట్ రైస్ నుండి 74 శాతం వరకు ఆర్సెనిక్ తొలగించబడుతుంది.

ఇవి కూడా చదవండి

PBA సాంకేతికతతో అన్నం వండడం వల్ల అందులో ఉండే స్టార్చ్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది హాని కలిగించదు. స్టార్చ్ తక్కువగా ఉన్నప్పుడు, అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరగదు. మీరు ఈ విధంగా వండిన అన్నం తినడం వల్ల మీ బరువు పెరగదు. మీరు మీ బరువును సులభంగా నియంత్రించగలుగుతారు. షుగర్‌ లెవల్స్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచగలుగుతారని నిపుణులు వివరించారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి