AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tablet Vaccine: ఇక కరోనా టీకా ఇంజక్షన్ మర్చిపోండి..మాత్రలు..నాజల్ డ్రాప్స్ తో కోవిడ్ ను గెలిచేందుకు కంపెనీలు సిద్ధం!

Corona Tablet Vaccine: మాకు సిరెంజిలు అవసరం లేదు.. మాత్రలతో టీకా వేసేస్తాం అంటున్నారు.. శాన్ఫ్రాన్సిస్కో బయోటెక్ కంపెనీ వాక్సార్ట్ కి చెందిన చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ సీన్ టక్కర్.

Tablet Vaccine: ఇక కరోనా టీకా ఇంజక్షన్ మర్చిపోండి..మాత్రలు..నాజల్ డ్రాప్స్ తో కోవిడ్ ను గెలిచేందుకు కంపెనీలు సిద్ధం!
Corona Tablet Vaccine
KVD Varma
|

Updated on: May 05, 2021 | 10:08 AM

Share

Tablet Vaccine: మాకు సిరెంజిలు అవసరం లేదు.. మాత్రలతో టీకా వేసేస్తాం అంటున్నారు.. శాన్ఫ్రాన్సిస్కో బయోటెక్ కంపెనీ వాక్సార్ట్ కి చెందిన చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ సీన్ టక్కర్. కరోనా పై యుద్ధానికి బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న వ్యాక్సిన్ ప్రక్రియ ప్రపంచమంతా ఊపందుకున్న దశలో ఈ మాటలు కొంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇప్పటివరకూ వ్యాక్సిన్ అంటే..సూది మందుగానే మనకు తెలుసు. కానీ మాత్రలు.. ముక్కులో వేసే మందులా టీకాను తీసుకువస్తామని వాక్సార్ట్ కంపెనీ చెబుతుండటం కరోనా మహమ్మారితో హడలి పోతున్న ప్రజలకు గోప్పవరంలా కనిపిస్తోంది. వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే ఈ విధానం అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. అప్పటికి ప్రపంచమంతా ఇంజక్షన్ల రూపంలో రవాణా అవుతున్న కరోన టీకా.. మాత్రలు, నాజల్ డ్రాప్స్ తరహాలో రవాణా కావడం ప్రారంభం కావచ్చని కంపెనీ అంటోంది. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిలవ చేయడానికి ఐస్ క్యూబ్స్ వాడాల్సిన పరిస్థితి నుంచి బయట పడొచ్చని వారంటున్నారు.

మీడియాతో సోమవారం మాట్లాడిన శాన్ఫ్రాన్సిస్కో బయోటెక్ కంపెనీ వాక్సార్ట్ యొక్క చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ సీన్ టక్కర్ “మా నిరీక్షణ సంవత్సరానికి ఒక టాబ్లెట్,” అని చెప్పారు. సాధారణ విటమిన్ టాబ్లెట్ వలె కనిపించే మాత్రను తమ కంపెనీ కొత్త COVID-19 టీకాగా చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఆయన తెలిపారు. ఇప్పుడే ఫేజ్ I ట్రయల్స్ పూర్తి చేసామని ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పిన ఆయన ఈ వేసవిలో ఫేజ్ II ట్రయల్స్ అదేవిధంగా ఈ సంవత్సరం చివరలో మందు సమర్ధతను నిరూపించే ట్రయల్స్ నిర్వహించాలని తమ బృందం ప్లాన్ చేస్తోందని చెప్పారు. ఇక ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే సంవత్సరం మొదట్లో అమెరికాలో ఈ మాత్రల అత్యవసర వినియోగం కోసం అనుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోంది? నాజల్ స్ప్రే అలాగే నోటితో తీసుకునే కరోనా వ్యాక్సిన్లను రూపొందించడానికి ప్రయత్నిస్తున్న సంస్థల సంఖ్య ఇంకా తక్కువగా ఉంది. కొత్త ఇంజెక్షన్ వెర్షన్లను ప్రవేశపెట్టడానికి డజన్ల కొద్దీ సంస్థలు పనిచేస్తున్నాయి. వారితో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్న 93 వ్యాక్సిన్ ట్రయల్స్‌లో కేవలం రెండు నోటి మాత్రలు, ఏడు నాసికా రకాలు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వివిధ దేశాల్లోని రెగ్యులేటర్లు కొద్దిమందిని మాత్రమే ఆమోదించినప్పటికీ, ప్రపంచ ఆర్థిక వినాశనాన్ని సృష్టించిన వైరస్‌ను నియంత్రించగల ప్రపంచ సామర్థ్యంపై దీని ప్రభావం భారీగా ఉంటుంది. “నాజల్ అలాగే నోటి ద్వారా ఇచ్చే వ్యాక్సిన్లు చాలా మంచివి వస్తున్నాయి” అని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ గత వారం ఇటలీలోని ఫ్లోరెన్స్‌లోని యునిసెఫ్ ఇన్నోసెంటి పరిశోధనా కేంద్రం సమన్వయంతో ఆన్‌లైన్ ప్యానెల్ సందర్భంగా ఆరోగ్య అధికారులకు చెప్పారు. “అది వ్యాక్సినేషన్ ప్రక్రియను చాలా సులభం చేస్తుంది.” ఆయన తెలిపారు.

వక్సార్ట్ నిర్వహించిన ఒక సర్వే ఫలితాలు గత వారం విడుదల చేశారు.అమెరికాలో ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 23% మంది ప్రజలు కోవిడ్ 19 వ్యాక్సిన్‌తో బాధపడటం ఇష్టం లేదని చెప్పారు. అయితే వారిలో మూడింట ఒకవంతు మంది టీకా టాబ్లెట్ అందుబాటులో ఉంటే తీసుకుంటామని చెప్పారు. దాని ఆధారంగా, వ్యాక్సార్ట్ అంచనా ప్రకారం, టాబ్లెట్ మరో 19 మిలియన్ల మందికి అమెరికాలో రోగనిరోధక శక్తిని పొందటానికి సిద్ధంగా ఉన్నవారి సంఖ్యను పెంచుతుంది.

తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో, టీకా పంపిణీ చాలా కష్టంగా ఉంది. ఇటువంటి చోట ఈ మాత్రల టీకా బాగా ఉపయోగపడుతుంది. ఇండియా విషయానికి వస్తే.. కరోనా విస్ఫోటనంతో ఆక్సిజన్ సరఫరా లేక ఆసుపత్రులు ఇబ్బందులు పడుతున్నాయి. శ్మశానవాటికలు మరణాల వేగంతో తట్టుకోలేకపోతున్నాయి. భారతదేశం కరోనావైరస్ వ్యాక్సిన్ల ప్రధాన ఉత్పత్తిదారు అలాగే ఎగుమతిదారు అయినప్పటికీ, మొత్తం 1.4 బిలియన్ జనాభాలో 10% కన్నా తక్కువ టీకాలు మాత్రమే వేయగలిగారు. టీకా పంపిణీ కోసం వందలాది స్థానిక ఆసుపత్రులలో వ్యాక్సిన్ హబ్‌లతో భారతదేశం అంతటా బాగా అల్లిన లాజిస్టిక్స్ నెట్‌వర్క్ అవసరమని స్వామినాథన్ చెప్పారు. ఇక విద్యుత్తు, మౌలిక సదుపాయాలు లేని దేశంలో వ్యాక్సిన్ పంపిణీని ఊహించడం కష్టం అని పేర్కొన్నారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ల ఓరల్ టాబ్లెట్లు అలాగే నాజల్ స్ప్రిట్జెస్ ఆ లాజిస్టికల్ సమస్యలను చాలావరకు పరిష్కరించగలవు. “మీరు ఈ టాబ్లెట్‌ను మెయిల్(కొరియర్) ద్వారా పంపవచ్చు. మీ ప్రజలు 20 లేదా 30 రెట్లు సులభంగా రోగనిరోధక శక్తిని పొందవచ్చు ”అని వక్సార్ట్ యొక్క ప్రధాన శాస్త్రవేత్త టక్కర్ తన మాత్రను చూపిస్తూ చెప్పారు. “మీరు దీన్ని ఫ్రీజర్‌లు లేని ప్రదేశాలకు రవాణా చేయవచ్చు. ప్రజలను రోగనిరోధక శక్తినిచ్చే అర్హత కలిగిన వైద్య వ్యక్తి మీకు అవసరం లేదు. ” అని ఆయన ముక్తాయించారు.

Also Read: Hand Hygiene day: జర భద్రం.. చేతులను శుభ్రం చేసుకుంటే ఉపయోగాలు ఏమిటి.? నేడు చేతుల పరిశుభ్రత దినోత్సవం

ఈ నెల 15లోగా 9 లక్షల వ్యాక్సిన్ల రాక..! 45 ఏళ్లకు పైబడి వారికి పంపిణీ.. మిగిలితే ఉద్యోగులకు..?