Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Fungus: పురుషుల్లోనే బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువ.. భారతీయ వైద్యుల పరిశోధనలో వెల్లడి

Black Fungus: బ్లాక్ ఫంగస్ బారిన పురుషులే ఎక్కువగా పాడేందుకు అవకాశం ఉందని ఒక పరిశోధనలో వెల్లడి అయింది. నలుగురు భారతీయ వైద్యులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తెలిసిందని చెబుతున్నారు.

Black Fungus: పురుషుల్లోనే బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువ.. భారతీయ వైద్యుల పరిశోధనలో వెల్లడి
Black Fungus
Follow us
KVD Varma

|

Updated on: May 22, 2021 | 11:12 AM

Black Fungus: బ్లాక్ ఫంగస్ బారిన పురుషులే ఎక్కువగా పాడేందుకు అవకాశం ఉందని ఒక పరిశోధనలో వెల్లడి అయింది. నలుగురు భారతీయ వైద్యులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తెలిసిందని చెబుతున్నారు. ఈ పరిశోధన ఫలితాలు త్వరలో ప్రచురిస్తారు. కోవిడ్ -19 లో ముకోర్మైకోసిస్ అనే ఈ పరిశోధన ఇండియాలోని బ్లాక్ ఫంగస్ కేసులపై క్రమబద్ధమైన సమీక్ష గా చెబుతున్నారు. అరుదైన ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా తీవ్రమైనది కూడాను. అటువంటి ఫంగస్ బారిన పడిన కరోనా పేషెంట్ల 101 కేసులను ఈ పరిశోధన విశ్లేషించింది. ఈ ఫంగస్ సోకిన వారిలో 79 మంది పురుషులే ఉంటున్నారని పరిశోధనలో తేలింది. డయాబెటిస్ మెల్లిటస్ అనే ఫంగస్ అతి ప్రమాదకారకంగా మారినట్టు గుర్తించారు. పరిశోధన జరిగిన 101 మంది పేషెంట్స్ లో 83 మంది ఈ ఫంగస్ కారణంగానే బాధపడుతున్నట్టు కనుగొన్నారు.

ఎల్సేవియర్ అనే పత్రికలో ఈ అధ్యయన వివరాలు త్వరలో ప్రచురితం కానున్నాయి. కోల్‌కతాలోని జిడి హాస్పిటల్ అండ్ డయాబెటిస్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ అవదేశ్ కుమార్ సింగ్, డాక్టర్ రితు సింగ్, ముంబైలోని లీలవతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ శశాంక్ జోషి, న్యూ ఢిల్లీలోని నేషనల్ డయాబెటిస్,ఊబకాయం, కొలెస్ట్రాల్ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ అనూప్ మిశ్రా కలిసి భారతదేశానికి చెందిన 82 మందితో సహా 101 మంది రోగులను అధ్యయనం చేశారు. వీరిలో యుఎస్ నుండి 9 మరియు ఇరాన్ నుండి ముగ్గురు బాధితులు కూడా ఉన్నారు.

కోవిడ్ -19 అనుబంధ ముకోర్మైకోసిస్ కారణంగా ఇప్పటివరకూ మహారాష్ట్ర లో గరిష్ట మరణాలు (90) సంభవించాయి. ఈ అధ్యయనంలో 101 మందిలో 31 మంది ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా మరణిస్తున్నారు. ముకోర్మైకోసిస్‌ను అభివృద్ధి చేసిన 101 మందిలో 60 మందికి క్రియాశీల కోవిడ్ -19 సంక్రమణ ఉందని, 41 మంది కోలుకున్నారని డేటా చూపించింది. 101 మందిలో 83 మందికి డయాబెటిస్ ఉండగా, ముగ్గురికి క్యాన్సర్ ఉంది.

ఎండోక్రినాలజిస్ట్ అయిన డాక్టర్ శశాంక్ జోషి మాట్లాడుతూ, కోవిడ్ -19 కోసం బ్లాక్ ఫంగస్ రోగులు ఏ చికిత్స తీసుకున్నారో వారు అధ్యయనం చేశారు. మొత్తం 76 మంది రోగులకు రోగనిరోధక మందుగా కార్టికోస్టెరాయిడ్ ఉపయోగించిన చరిత్ర ఉంది, 21 మందికి రెమ్‌డెసివిర్ అలాగే నాలుగు టోసిలిజుమాబ్‌లు తీసుకున్న బాధితులూ ఉన్నారు.

ఒక కేసులో..డయాబెటిస్‌తో ఉన్న ముంబైకి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి స్టెరాయిడ్, టోసిలిజుమాబ్ రెండూ ఇచ్చారు. అతను ఫంగల్ ఇన్ఫెక్షన్తో మరణించాడు. కానీ ముంబైలో డయాబెటిస్ లేని 38 ఏళ్ల వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. కోవిడ్ -19 ఉన్న డయాబెటిక్ రోగులలో మరణం, తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు కూడా ఈ పరిశోధనలో తేలింది.

Also Read: Two More Coronaviruses: మనుషులకు పొంచి ఉన్న మరో ముప్పు.. మరో రెండు వైరస్‌లను గుర్తించిన సైంటిస్టులు..?

Anandayya medicine : సీఎం సూచనల మేరకు కృష్ణపట్నం చేరుకున్న ICMR బృందం.. ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందుపై పరిశీలన