ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యల బారిన పడేవారి సంఖ్యపెరిగిపోతోంది. మారుతున్న జీవనశైలి కారణంగా వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక అనారోగ్య సమస్యల్లో ఇబ్బంది పెట్టేది ఎసిడిటి ఒకటి. దీని వల్ల చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. తినే ఆహారపు అలవాట్ల కారణంగా ఎసిడిటీ సమస్య తలెత్తుతోంది. చాలా మంది ఏదైనా కాస్త తినగానే తేన్పులు, ఆవలింతలు వంటివి వస్తుంటాయి. ఎక్కువగా తినడం, సమయం కాని సమయంలో తినడం, భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్ పాటించడం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది. మరోవైపు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, హానికరమైన ఆహారం వంటి అనేక అంశాలు ఎసిడిటీకి దారితీస్తాయి. అయితే కొన్ని సాధారణ జీవనశైలి మార్పులతో ఎసిడిటీని నివారించవచ్చు. ఎసిడిటీ నివారణకు అనేక చిట్కాలను సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు.
ఎసిడిటీ రాకుండా పాటించాల్సిన చిట్కాలు ఇవే..
ఎక్కువగా కారం, పులుపు, ఉప్పు, పులియబెట్టిన, వేయించిన, ఫాస్ట్ ఫుడ్ తినడాన్ని మానుకోండి.
ఏ ఆహారమైనా సరే సమతుల్యంగా తినండి. అతిగా తింటే కూడా ప్రమాదమే.