ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎవ్వరూ కూడా ఫుడ్ను సరైన సమయానికి తినలేని పరిస్థితి ఏర్పడింది. సమయం దాటిన తర్వాత భోజనం చేయడం.. అర్ధరాత్రి సమయాల్లో పడుకోవడం లాంటివి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. మీ జీవనశైలిలో మార్పులు చోటు చేసుకున్నట్లయితే.. కచ్చితంగా కడుపు సంబంధిత సమస్యలు వచ్చినట్లే. కొంతమందికి భోజనం తిన్న వెంటనే ఛాతీలో మంటగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలా ఉన్నట్లయితే.. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, అలాగే గ్యాస్ పెరిగిపోవడంతో ఛాతీలో మంట లేదా గుండెల్లో మంట లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఇలా వచ్చినప్పుడు.. మీ స్లీప్ పొజిషన్ ద్వారా దాని నుంచి ఉపశమనం పొందొచ్చునని వైద్యులు చెబుతున్నారు. మీరు ఎడమ వైపు నిద్రపోయినట్లయితే.. ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చునని ఇప్పటికే పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే..