AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాముడిగా ప్రభాస్‌.. మరి ఆ నలుగురు ఎవరు..!

ప్రభాస్ తన 22వ సినిమాను ప్రకటించేశారు. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌తో ప్రభాస్ 22వ చిత్రంలో నటించనుండగా.. ఆదిపురుష్‌ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

రాముడిగా ప్రభాస్‌.. మరి ఆ నలుగురు ఎవరు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 18, 2020 | 10:00 AM

Share

Prabhas 22 Adipurush: ప్రభాస్ తన 22వ సినిమాను ప్రకటించేశారు. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌తో ప్రభాస్ 22వ చిత్రంలో నటించనుండగా.. ఆదిపురుష్‌ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ని విడుదల చేయగా.. రామాయణం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఇదే విషయంపై మాట్లాడిన ప్రభాస్‌.. ఇందులోని ప్రతి పాత్ర గొప్పదేనని అన్నారు. ప్రతి పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుందని.. పౌరాణిక పాత్రలో నటించడం ఆనందంగా, ఉత్సాహంగా ఉందని తెలిపారు. కాగా రామాయణంలోని అరణ్యవాసం నుంచి రావణకాష్టం వరకు ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక పోస్టర్‌లో రావణాసురుడు, హనుమంతుడు కూడా ఉండగా.. ఈ రెండు పాత్రల్లో ఎవరు నటించబోతున్నారన్న చర్చ ఫిలిం వర్గాల్లో మొదలైంది. అలాగే  సీత, లక్ష్మణుడి పాత్రలు కూడా ఇందులో కీలకం కాగా.. వారి పాత్రలో ఎవరు కనిపించనున్నారన్న టాక్ నడుస్తోంది. కాగా మరోవైపు హిందీ, తెలుగులో రెండింటిలో ఈ సినిమా ఒకేసారి తెరకెక్కుతోంది కాబట్టి.. ఇక్కడి వారిని కూడా తీసుకుంటారా..! లేక బాలీవుడ్‌ వారే ఇందులో భాగం కానున్నారా..! అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మరి వీటన్నింటికి సమాధానం తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రాన్ని భూష‌ణ్ కుమార్‌, క్రిష‌న్ కుమార్‌, ఓమ్ రౌత్‌‌, ప్ర‌సాద్ సూత‌ర్‌, రాజేష్ నాయ‌ర్ తదితరులు నిర్మిస్తున్నారు.

Read More:

అమెరికా ప్లాన్‌లో మహేష్ బాబు‌!

ఈ నెల 19న ‘రాయలసీమ ఎత్తిపోతల’ టెండర్‌ ఖరారు